🕉– *ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి*
➖〰〰〰〰〰〰➖
ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
★ రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా,
‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు,
ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.
🕉 *సమయం* 🕉 *వాహనం*
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🟢ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)
🟢ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం
🟢 ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం
🟢మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం
🟢మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
🟢సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం
🟢సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం
🟢రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం
🕉 *ఆర్జితసేవలు రద్దు :*
శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
*Dept.Of PRO TTD.*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి