ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 17 ఫిబ్రవరి 2021: భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు మార్చి నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి