ప్రైవేటు స్కూళ్లలోఉచిత విద్యకు అవకాశంఒకటో తరగతిలో ప్రవేశాలకు6 నుంచి దరఖాస్తు


సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు
పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరా
నికి ఉచిత విద్యకోసం ఆన్లైన్ దరఖాస్తు
చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఎస్. సురేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకట
నలో సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25
శాతం ప్రవేశాలు ఉచితంగా కల్పించాలని
నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు
ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మొదటి
దశ ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 9,064
మంది విద్యార్థులు, వారికి కేటాయించిన
పాఠశాలలను ఎంపిక చేశారు. రెండో దశ ప్రవే
శాలకు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్
లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచిం
చారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా
ఆధారంగా విద్యార్థుల అర్హతను పరిశీలించి,
మే 22న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎం
పిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన
వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రవేశాలు
తీసుకోవచ్చని తల్లిదండ్రులకు సూచించారు.
వివరాలను http://cse.ap.gov. in వెబ్సై
ట్లో నమోదు చేయాలని కమిషనర్ సురేష్కు
మార్ తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh