న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17. పోస్టులు: చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్ (ఫైనాన్స్) తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
చివరి తేది: జూన్ 18, 2020
వెబ్సైట్: http://www.aiatsl.com/
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
11, జూన్ 2020, గురువారం
🔳ఈఎస్ఐసీ, న్యూదిల్లీ
న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్ రెసిడెంట్-43, స్పెషలిస్ట్-02.
విభాగాలు: మెడిసిన్, సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, క్యాజువాలిటీ, గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 09, 2020. వేదిక: ఇందిరా గాంధీ ఈఎస్ఐ హాస్పిటల్, జిల్మీ, దిల్లీ-110095.
వెబ్సైట్: https://www.esic.nic.in/
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్ రెసిడెంట్-43, స్పెషలిస్ట్-02.
విభాగాలు: మెడిసిన్, సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, క్యాజువాలిటీ, గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 09, 2020. వేదిక: ఇందిరా గాంధీ ఈఎస్ఐ హాస్పిటల్, జిల్మీ, దిల్లీ-110095.
వెబ్సైట్: https://www.esic.nic.in/
🔳ఐకార్-ఐవీఆర్ఐ
బెంగళూరులోని ఐకార్-ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 06 పోస్టుల: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), యంగ్ ప్రొఫెషనల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత, నెట్ అర్హత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 16, 2020.
వేదిక: ఐవీఆర్ఐ క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం, హెబ్బల్, బెంగళూరు.
వెబ్సైట్: http://www.ivri.nic.in/
మొత్తం ఖాళీలు: 06 పోస్టుల: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), యంగ్ ప్రొఫెషనల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత, నెట్ అర్హత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 16, 2020.
వేదిక: ఐవీఆర్ఐ క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం, హెబ్బల్, బెంగళూరు.
వెబ్సైట్: http://www.ivri.nic.in/
🔳కంటి వెలుగును కాపాడే కొలువులు! ఇంటర్ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు కంటి వెలుగును కాపాడే కొలువులు!
ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు. నాణ్యమైన జీవనానికి అవసరమైన కంటి చూపును కాపాడటంలో వీరి పాత్ర ప్రధానమైంది. ఆధునిక యుగంలో మారిన జీవనశైలి వల్ల ఇలాంటి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించాలంటే ఆప్టోమెట్రీ డిప్లొమా లేదా డిగ్రీ పొంది ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హతతో విద్యార్థులు ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంటి వెలుగును కాపాడే కొలువులు!
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. అన్ని వయసుల వారూ దాదాపు ఏదో ఒక కంటి ఇబ్బందితో ఉంటారని అంచనా. లోపం ఎలాంటిదైనా పరీక్షలు జరపాలి. తగిన చికిత్సను అందించాలి. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు. వీళ్లు చేసే టెస్ట్ల ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు మొదలవుతాయి. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారాలను ప్రాథమిక దశలో ఆప్టోమెట్రీ కోర్సులు చదివిన అభ్యర్థులు చూపుతారు. కొన్ని ఆప్టిక్లను వినియోగించి కంటి చూపుపై సరైన అంచనాకు వస్తారు. ఆ సమయంలో నమోదు చేసే వివరాలే చికిత్సకు కీలకమైనవి. ఆ పరిశీలనలను డాక్టర్కు వివరిస్తారు. వాటి ఆధారంగానే అవసరమైన మందులు, లెన్స్లు, ఇతర సూచనలను వైద్యులు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మొదటి దశలో కీలంగా పనిచేసేవారే ఆప్టోమెట్రీషియన్లు. దాదాపు ప్రతి కంటి ఆసుపత్రిలోనూ వీళ్లు ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్మీడియట్ అర్హతతో ఆప్టోమెట్రీ కోర్సులు చేయవచ్చు.
డిప్లొమా.. డిగ్రీ
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ఇంటర్ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు. వ్యవధి రెండేళ్లు. అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు. ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి. జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్డీకీ అవకాశాలు ఉన్నాయి. బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్డీలనూ నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్షిప్ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్ బోర్డు లేదా ఓపెన్ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు; బయాలజీ, ఫిజిక్స్ల్లో బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ప్రకటనలు జూన్ లేదా జులైల్లో వెలువడతాయి. జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్ స్కోర్తో చేర్చుకుంటున్నాయి.
ఏయే నైపుణ్యాలు?
ఆప్టోమెట్రిస్ట్గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది. సహనం, సమన్వయంతో వ్యవహరించడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో రాణించే అవకాశం ఉంది. కోర్సులో భాగంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, ఆప్టిక్స్పై అవగాహన కల్పిస్తారు. క్లినికల్ ఆఫ్తాల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాల గురించీ తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
ఉద్యోగావకాశాలు
దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. తగిన సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీషియన్లు అవసరం. కానీ అంతమంది ప్రస్తుతం మనదేశంలో లేరు. ఈ విభాగంలో డిగ్రీ చేస్తే ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రీషియన్లుగా సేవలు అందించవచ్చు. ఎక్కువ ఉద్యోగాలు కార్పొరేట్ కంటి ఆసుపత్రులు, కార్పొరేట్ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మ్యాక్సీ విజన్, వాసన్ ఐ కేర్, అగర్వాల్ ఐ హాస్పిటల్ తదితర కార్పొరేట్ కంటి ఆసుపత్రుల్లో వీరి సేవలు వినియోగించుకుంటారు. కంటివైద్యులు సేవలందిస్తున్న ప్రతిచోటా ఆప్టోమెట్రీషియన్లు దాదాపు ఉంటారు. టైటాన్ ఐ ప్లస్, లెన్స్కార్ట్, లారెన్స్ అండ్ మేయో, విజన్ ఎక్స్ప్రెస్, జీకేబీ తదితర కార్పొరేట్ ఆప్టికల్ దుకాణాల్లోనూ వీరి సేవలు అవసరమవుతాయి. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారికి బోధన రంగంలో అవకాశాలు లభిస్తాయి.
ఇవీ సంస్థలు
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్) కోర్సు అందిస్తోంది. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వంద మార్కులకు జనరల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
* అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూదిల్లీ, రిషికేశ్ క్యాంపస్ల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్షిప్లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.
* శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్ స్కూల్, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్షిప్ పూర్తిచేస్తారు. ప్రవేశం నీట్ స్కోర్, ఇంటర్ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
* ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
* ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్షిప్ను హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ల్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ క్యాంపస్ల్లో చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.
* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
* భారతీ విద్యాపీఠ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.
* గీతం, విశాఖపట్నం క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
* ఆంధ్రప్రదేశ్లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్ మెడికల్ కాలేజీ, ఆంధ్రా మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-అమలాపురం, బొల్లినేని మెడ్ స్కిల్స్ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్ఎల్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్స్-రాజమండ్రి, సమత స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.
దరఖాస్తు చేశారా?
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*సీడీఎఫ్డీ, హైదరాబాద్లో ఫెలోషిప్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత. చివరి తేది: జూన్ 04, 2020.
* ఏఐఏపీజీసెట్-2020
అర్హత: బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీఎస్ఎంఎస్/ బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి తేది: జూన్ 05, 2020.
* ఏపీ డీఈఈసెట్-2020
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 05, 2020.
* ఎన్ఐఆర్డీపీఆర్లో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎల్ఎల్బీ; బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ; ఇతర పీజీ డిగ్రీల్లో ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: జూన్ 10, 2020.
* సీఎంటీఐ, బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 12, 2020.
కంటి వెలుగును కాపాడే కొలువులు!
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. అన్ని వయసుల వారూ దాదాపు ఏదో ఒక కంటి ఇబ్బందితో ఉంటారని అంచనా. లోపం ఎలాంటిదైనా పరీక్షలు జరపాలి. తగిన చికిత్సను అందించాలి. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు. వీళ్లు చేసే టెస్ట్ల ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు మొదలవుతాయి. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారాలను ప్రాథమిక దశలో ఆప్టోమెట్రీ కోర్సులు చదివిన అభ్యర్థులు చూపుతారు. కొన్ని ఆప్టిక్లను వినియోగించి కంటి చూపుపై సరైన అంచనాకు వస్తారు. ఆ సమయంలో నమోదు చేసే వివరాలే చికిత్సకు కీలకమైనవి. ఆ పరిశీలనలను డాక్టర్కు వివరిస్తారు. వాటి ఆధారంగానే అవసరమైన మందులు, లెన్స్లు, ఇతర సూచనలను వైద్యులు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మొదటి దశలో కీలంగా పనిచేసేవారే ఆప్టోమెట్రీషియన్లు. దాదాపు ప్రతి కంటి ఆసుపత్రిలోనూ వీళ్లు ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్మీడియట్ అర్హతతో ఆప్టోమెట్రీ కోర్సులు చేయవచ్చు.
డిప్లొమా.. డిగ్రీ
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ఇంటర్ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు. వ్యవధి రెండేళ్లు. అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు. ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి. జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్డీకీ అవకాశాలు ఉన్నాయి. బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్డీలనూ నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్షిప్ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్ బోర్డు లేదా ఓపెన్ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు; బయాలజీ, ఫిజిక్స్ల్లో బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ప్రకటనలు జూన్ లేదా జులైల్లో వెలువడతాయి. జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్ స్కోర్తో చేర్చుకుంటున్నాయి.
ఏయే నైపుణ్యాలు?
ఆప్టోమెట్రిస్ట్గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది. సహనం, సమన్వయంతో వ్యవహరించడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో రాణించే అవకాశం ఉంది. కోర్సులో భాగంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, ఆప్టిక్స్పై అవగాహన కల్పిస్తారు. క్లినికల్ ఆఫ్తాల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాల గురించీ తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
ఉద్యోగావకాశాలు
దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. తగిన సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీషియన్లు అవసరం. కానీ అంతమంది ప్రస్తుతం మనదేశంలో లేరు. ఈ విభాగంలో డిగ్రీ చేస్తే ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రీషియన్లుగా సేవలు అందించవచ్చు. ఎక్కువ ఉద్యోగాలు కార్పొరేట్ కంటి ఆసుపత్రులు, కార్పొరేట్ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మ్యాక్సీ విజన్, వాసన్ ఐ కేర్, అగర్వాల్ ఐ హాస్పిటల్ తదితర కార్పొరేట్ కంటి ఆసుపత్రుల్లో వీరి సేవలు వినియోగించుకుంటారు. కంటివైద్యులు సేవలందిస్తున్న ప్రతిచోటా ఆప్టోమెట్రీషియన్లు దాదాపు ఉంటారు. టైటాన్ ఐ ప్లస్, లెన్స్కార్ట్, లారెన్స్ అండ్ మేయో, విజన్ ఎక్స్ప్రెస్, జీకేబీ తదితర కార్పొరేట్ ఆప్టికల్ దుకాణాల్లోనూ వీరి సేవలు అవసరమవుతాయి. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారికి బోధన రంగంలో అవకాశాలు లభిస్తాయి.
ఇవీ సంస్థలు
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్) కోర్సు అందిస్తోంది. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వంద మార్కులకు జనరల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
* అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూదిల్లీ, రిషికేశ్ క్యాంపస్ల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్షిప్లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.
* శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్ స్కూల్, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్షిప్ పూర్తిచేస్తారు. ప్రవేశం నీట్ స్కోర్, ఇంటర్ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
* ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
* ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్షిప్ను హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ల్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ క్యాంపస్ల్లో చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.
* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
* భారతీ విద్యాపీఠ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.
* గీతం, విశాఖపట్నం క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
* ఆంధ్రప్రదేశ్లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్ మెడికల్ కాలేజీ, ఆంధ్రా మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-అమలాపురం, బొల్లినేని మెడ్ స్కిల్స్ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్ఎల్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్స్-రాజమండ్రి, సమత స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.
దరఖాస్తు చేశారా?
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*సీడీఎఫ్డీ, హైదరాబాద్లో ఫెలోషిప్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత. చివరి తేది: జూన్ 04, 2020.
* ఏఐఏపీజీసెట్-2020
అర్హత: బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీఎస్ఎంఎస్/ బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి తేది: జూన్ 05, 2020.
* ఏపీ డీఈఈసెట్-2020
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 05, 2020.
* ఎన్ఐఆర్డీపీఆర్లో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎల్ఎల్బీ; బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ; ఇతర పీజీ డిగ్రీల్లో ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: జూన్ 10, 2020.
* సీఎంటీఐ, బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 12, 2020.
🔳ఎయిమ్స్, భోపాల్
భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 155. పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్సైట్: https://www.aiimsbhopal.edu.in/
మొత్తం ఖాళీలు: 155. పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్సైట్: https://www.aiimsbhopal.edu.in/
🔳ఐఏఎస్ఎస్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
గువాహటిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
వెబ్సైట్: https://iasst.res.in/
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
వెబ్సైట్: https://iasst.res.in/
🔳పాఠశాల విద్యార్థుల సిలబస్ తగ్గింపు? అభిప్రాయాలు కోరిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరాన్ని పాఠశాల విద్యార్థులు నష్టపోకుండా పలు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ట్వీట్ చేశారు. సిలబస్, బోధనా సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ‘సిలబస్ఫర్స్టూడెంట్స్2020’ అనే హ్యాష్ట్యాగ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు.
రోటరీ ఇండియాతో కలిసి ఈ-లెర్నింగ్ పాఠాల తయారీ
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ-లెర్నింగ్ పాఠాలను తమ టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు... రోటరీ ఇండియాతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేతులు కలిపింది. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్ చెప్పారు. విద్యాదాన్ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి మొత్తం 12 ఎన్సీఈఆర్టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారమవుతాయి.
రోటరీ ఇండియాతో కలిసి ఈ-లెర్నింగ్ పాఠాల తయారీ
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ-లెర్నింగ్ పాఠాలను తమ టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు... రోటరీ ఇండియాతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేతులు కలిపింది. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్ చెప్పారు. విద్యాదాన్ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి మొత్తం 12 ఎన్సీఈఆర్టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారమవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...