6, డిసెంబర్ 2020, ఆదివారం

Pharmacy Counseling 2020 Update || ఏపీ ఫార్మసీ డిప్లొమా కౌన్సిలింగ్ 2020 పై లేటెస్ట్ అప్డేట్

 

ఏపీ ఫార్మసీ డిప్లొమా కౌన్సిలింగ్ 2020 పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ  డిప్లొమో కోర్సులలో ప్రవేశాల కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వచ్చింది.

ఏపీ లో పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫార్మసీ డిప్లొమో కోర్సుల ప్రవేశాల కు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయినది.

ఏపీ ఫార్మసీ డిప్లొమో కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్  2020 :

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుడిసెంబర్ 8 -10
ధ్రువపత్రాల పరిశీలనడిసెంబర్ 9-10
సీట్లు, కళాశాలల ఎంపిక ఆప్షన్స్డిసెంబర్ 8-10
సీట్ల కేటాయింపుడిసెంబర్ 12  


https://apeamcetbd.nic.in/default1.htm












MBBS, BDS-2020 Counciling Update || ఎంబీబీఎస్, బీడీఎస్ 2020 కౌన్సిలింగ్ లో మార్పులు

 

ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ -2020 లో మార్పులు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ షెడ్యూల్ -2020 పై ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక అధికారిక ప్రకటన చేసినది.


ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ లు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు ప్రకటించిన తేదీలలో కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.

ఈ  ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులు సీట్లు కేటాయించిన కళాశాలల్లో చేరకుండా ఉంటే, తరువాతి కౌన్సిలింగ్ లో పాల్గొనే అర్హత ఉండదు అని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

విడుదలైన ఎన్జీ రంగా పీజీ ప్రవేశ పరీక్ష -2020 ఫలితాలు :


ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.


వ్యవసాయ వర్శిటీ పరిధిలో  నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది.

వివిధ విభాగాలలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచారు.

NG Ranga Result

CBSE -2021 పరీక్షలపై కీలక అప్డేట్ : సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్

 

రాబోయే ఏడాది 2021 వ సంవత్సరంలో సీబీఎస్ఈ బోర్డు-2021 పరీక్షలు రాతపూర్వకంగానే జరుగుతాయని CBSE బోర్డు ఒక కీలకమైన ప్రకటన చేసింది.

ఆన్లైన్ విధానంలో 2021 సంవత్సరంలో జరిగే సీబీఎస్ఈ పరీక్షలు జరగబోవు అని  ఈ ప్రకటన ద్వారా CBSE బోర్డు స్పష్టం చేసింది.

సీబీఎస్ఈ -2021 పరీక్ష తేదీలపై కసరత్తులు చేస్తున్న బోర్డు అతిత్వరలోనే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఈ ప్రకటన ద్వారా CBSE బోర్డు తెలిపింది.

Website

MAHILA Degree College Jobs Recruitment 2020 || త్రివేణి మహిళ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు ప్రకటన జారీ

 

త్రివేణి మహిళ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరం దగ్గర పటమట లో ఉన్న త్రివేణి మహిళ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన జారీ అయినది.

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ  మరియు డెమో ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

ముఖ్యమైన తేదీలు :

వాక్-ఇన్- ఇంటర్వ్యూ మరియు డెమోల నిర్వహణ తేదీ :

డిసెంబర్ 7,2020 (సోమవారం ), ఉదయం 10 గంటలకు.

విభాగాల వారీగా ఖాళీలు  :

ఈ ప్రకటన ద్వారా  క్రింది బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్టాటిస్టిక్స్ లెక్చరర్స్

డిగ్రీ మాథ్స్ లెక్చరర్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విభాగాలు అనుసరించి విద్యార్హతలను కలిగి ఉండవలెను.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లు, విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ తో ఈ క్రింది అడ్రస్ లో హాజరు కావాలి.

అడ్రస్ :

Triveni Mahila Degree College,

NSM School Road,

PATAMATA,

Vijayawada.

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ల ను సంప్రదించగలరు.

ఫోన్ నెంబర్స్ :

2465858, 2486699.