ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ -2020 లో మార్పులు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ షెడ్యూల్ -2020 పై ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక అధికారిక ప్రకటన చేసినది.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ లు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు ప్రకటించిన తేదీలలో కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులు సీట్లు కేటాయించిన కళాశాలల్లో చేరకుండా ఉంటే, తరువాతి కౌన్సిలింగ్ లో పాల్గొనే అర్హత ఉండదు అని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి