15, జులై 2021, గురువారం

నీట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల | ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం 13.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.8.2021 | పరీక్ష తేది: 12 సెప్టెంబర్‌ 2021(ఆదివారం) పరీక్ష సమయం: మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు



నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ప్రవేశాలు కల్పిస్తారు.
Adminissionsనేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–2021
అర్హతలు:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్‌/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 17ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం: పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో మొత్తం 180 ప్రశ్నలు–720 మార్కులకు నీట్‌ పరీక్ష జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్‌లు.. సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ ఉంటాయి. సెక్షన్‌ ఏలో 35 ప్రశ్నలు–140 మార్కులు, సెక్షన్‌ బీలో 15 ప్రశ్నలు–40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సెక్షన్‌ బీలోని 15 ప్రశ్నల్లో ఏవైనా పదింటిని అటెంప్ట్‌ చేస్తే సరిపోతుంది. అంటే.. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలు–180 మార్కులు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు–180 మార్కులు, బాటనీ 45 ప్రశ్నలు–180 మార్కులు, జువాలజీ 45 ప్రశ్నలు–180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 13.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.8.2021

పరీక్ష తేది: 12 సెప్టెంబర్‌ 2021(ఆదివారం)
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు;

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in

ఏపీ ఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021| దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021


ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి.. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీఐసెట్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఐసెట్‌ ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.
Adminissions 
ఎంట్రెన్స్‌: ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌–2021
ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంబీఏ/ఎంసీఏ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభం: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 14.08.2021

పరీక్ష తేదీలు: సెప్టెంబర్‌ 17, 18.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/icet

JNTUA Results Links B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem (R15) JNTUA: B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary 2021

JNTUA: B.Tech II Year II Sem. (R15) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:56 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech III Year II Sem. (R15) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:54 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech II Year II Sem. (R13) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:50 PM PDT

For Result: Click Here...

JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary Result 2021

Posted: 13 Jul 2021 08:38 PM PDT

For Result: Click Here...

13, జులై 2021, మంగళవారం

భారత రక్షణ విభాగంలో 458 ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ విభాగం.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 458
పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మెన్‌ మేట్, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్‌మెన్‌ తదితరాలు.
అర్హతలు..
ట్రే డ్స్‌మెన్‌మేట్‌: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

జేఓఏ: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

మెటీరియల్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఫైర్‌మెన్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్, 41 ఫీల్డ్‌ ఆమ్యునేషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in  and www.ncs.gov.in 

12, జులై 2021, సోమవారం

ఇండియన్‌ నేవీలో 350 మెట్రిక్‌ రిక్రూట్‌ సెయిలర్లు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

ఇండియన్‌ నేవీ అక్టోబర్‌ 2021లో ప్రారంభ‌మయ్యే మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌) సెయిలర్ల బ్యాచ్‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 350
పోస్టుల వివరాలు: చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.06.2001 నుంచి 30.09.2004 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: మొదట శిక్షణా సమయంలో స్టైపెండ్‌ రూపంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ లెవల్‌ 3 ప్రకారం వేతనం, ఎంఎస్‌పీ, డీఏ అందిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి.. సైన్స్‌ అండ్‌ మ్యాథమేటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌. ప్రశ్నల సరళి పదో తరగతి సిలబస్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

పూర్తి వివరాలక వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ | దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021 దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021 ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4. ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 5830

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263

భర్తీ చేసే బ్యాంకులు:

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • ఇండియన్‌ బ్యాంక్
  • ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్
  • పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్
  • యూకో బ్యాంక్
  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్‌(200మార్కులు) పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4.
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in

11, జులై 2021, ఆదివారం

ఏపీ, వైఎస్సార్‌ కడపలోని సాంఘిక సంక్షేమ విభాగంలో వివిధ ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైఎస్సార్‌ కడప జిల్లా సాంఘిక సంక్షేమ విభాగం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఆఫీస్‌ సబార్డినేట్‌–01, వాచ్‌మెన్‌–04, ఆఫీస్‌ వాచర్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐదోతరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. వాచ్‌మెన్‌/ఆఫీస్‌ వాచర్‌ పోస్టులకు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /హోంగార్డ్‌ /సివిల్‌ డిఫెన్స్‌ శిక్షణ పొంది ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐదు, ఏడు తరగతుల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/