9, డిసెంబర్ 2021, గురువారం

LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది. మీకు ఎల్‌ఐసీ పాలసీని ఉంటే సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీని వడ్డీ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. వ్యక్తిగత రుణంపై ఎల్‌ఐసీ వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీ ఎల్‌ఐసీ పాలసీపై మీరు ఎంత రుణం పొందుతారు అనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. లోన్ మొత్తం పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందులో 90% వరకు లోన్ పొందవచ్చు. మీ పాలసీ సరెండర్ విలువ రూ. 5 లక్షలు అయితే మీరు దానిపై 4.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. మీరు లోన్ కాలపరిమితికి ముందు చెల్లిస్తే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అని కూడా అంటారు.

అయితే LIC పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత అనేది పూర్తిగా దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణదాత ఆదాయం, అతను చేసే ఉపాధి పను, లోన్ మొత్తం ఎంత, రుణం తిరిగి చెల్లించే వ్యవధి ముఖ్యమైనవి. రుణ రేటు ఈ అంశాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. రుణంపై వడ్డీ రేటు ఫ్లాట్ రేట్ లేదా ఫ్లాట్ బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించి లెక్కిస్తారు. దీనిలో రుణం మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు. మీరు 5 లక్షల రుణం తీసుకుని క్రమంగా దాన్ని తిరిగి చెల్లించి 2 లక్షలకు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆ 2 లక్షలకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.

EMI ఎంత ఉంటుంది

సంవత్సరకాలానికి ఒక వ్యక్తి 9% చొప్పున రూ.1 లక్ష రుణం తీసుకుంటే అతను నెలకు రూ. 8,745 EMI చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని 2 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే అప్పుడు రూ. 4,568 EMI ఉంటుంది. 3 సంవత్సరాల పాటు రుణంపై రూ. 3,180 EMI ఉంటుంది. రుణాన్ని 4 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే, అప్పుడు రూ. 2,489 EMI ఉంటుంది. 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 2,076 EMI ఉంటుంది.

మీరు 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే, 1 సంవత్సరం కాలానికి నెలకు రూ. 44,191 EMI ఉంటుంది. 2 సంవత్సరాల లోన్ కాలవ్యవధిలో 23,304 EMI ఉంటుంది.3 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై EMI రూ. 18,472 అవుతుంది. 4 సంవత్సరాలకు రూ. 15,000 EMI, 5 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై రూ. 12,917గా ఉంటుంది.

రుణం ఎలా తీసుకోవాలి

మీరు లోన్ తీసుకోవడానికి LIC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ ఫారమ్‌ను ప్రింట్‌ అవుట్‌ తీసుకుని, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత రుణ దరఖాస్తు పూర్తవుతుంది. దీని తర్వాత, LIC మీ దరఖాస్తును ధృవీకరించి, లోన్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తారు.

 

Gemini Internet

Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ

సురక్షిత పెట్టుబడికి చాలామంది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకుంటారు. రిస్క్‌ను ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పాటు పోస్టాఫీస్ పథకాలు కూడా సురక్షితమైనవి. అంతేకాదు, ఇక్కడ పలు పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే అధిక వడ్డీరేటు వస్తుంది. కరోనా కంటే ముందు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) పైన అధిక వడ్డీ రేటును ఇచ్చాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా FD వడ్డీ రేటును కనిష్టాలకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 5 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వస్తోంది.

అదే సమయంలో పోస్టాఫీస్ పథకాల్లో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు ఉంది. పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ గ్యారెంటీతో పాటు మంచి రిటర్న్స్ ఉంటాయి. వడ్డీ రేటు ప్రయోజనం త్రైమాసికం పరంగా ఉంటుంది.

పోస్టాఫీస్ FDలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. పోస్టాఫీస్ FDలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్ల కాలపరిమితి ఉంది.

 ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ

పోస్టాఫీస్ FD ప్రయోజనాలు

- పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రభుత్వ హామీ ఉంటుంది.

- ఇందులో ఇన్వెస్టర్ మనీ పూర్తి సురక్షితం.

- ఆఫ్ లైన్(క్యాష్, చెక్కు రూపంలో) రూపంలోను ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. లేదా ఆన్ లైన్(నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్) రూపంలోను ఇన్వెస్ట్ చేయవచ్చు.

- ఒక FDకి మించి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.

- జాయింట్ అకౌంట్ రూపంలోను FDని ఓపెన్ చేయవచ్చు.

- అయిదేళ్ల కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజడిట్ చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పన్ను మినహాయింపు ఉంది.

- ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు fdని ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.

- కనీసం రూ.1000 నుండి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.

- సాధారణంగా వడ్డీ రేట్లు 7 రోజుల నుండి 10 రోజుల కాలపరిమితిపై 5.50 శాతం ఉంది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 6.70 శాతం వడ్డీ రేటు ఉంది.

Gemini Internet

7, డిసెంబర్ 2021, మంగళవారం

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!

PM Mudra Yojana: కేంద్ర సర్కార్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రజలు ఉపాధిని పెంపొందించేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఇందులో మొదటి దశలో చాలా మందికి అండగా నిలిచింది ఈ పథకం. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం కూడా ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

సులభంగా రుణాలు..

ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన వారు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

అయితే నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. దాదాపు 12 కోట్ల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్ల పైగా లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంపై ఇది దృష్టి పెడుతుంది. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్లకుపైగా ఉపాధి పొందుతుండగా, చిన్న సంస్థలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటికి తోడ్పాటునిచ్చేందుకే ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు.

దరఖాస్తు చేసుకోండిలా..

ఈ పథకంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్‌ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు.

రుణ రకాలు:

► శిశు: రూ. 50,000 వరకు రుణాలు
► కిశోర్: రూ. 5 లక్షల వరకు
► తరుణ్: రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.

రుణం పొందేందుకు అర్హత:

► భారత పౌరుడై ఉండాలి
► ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి,
► ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో.
► రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.
► పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి.

Gemini Internet

27, నవంబర్ 2021, శనివారం

Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు

సురక్షిత పెట్టుబడికి పోస్టాఫీస్ స్కీం అద్భుతమైన ఎంపిక. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ భద్రమైన పెట్టుబడి కోసం, రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడని చాలామంది దీనిని ఎంచుకుంటారు. పోస్టాఫీస్ స్కీం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలలు లేదా 10 సంవత్సరాల్లో మీ డబ్బు రెండింతలు అవుతుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. కనీసం రూ.1000తో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కిసాన్ వికాస పత్ర ఖాతాలు తెరుచుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరికి కేవీపీ పత్రాలను బదలీ చేసుకోవచ్చు. రుణం ఇస్తారు. ఇందుకు కేవీపీ తీసుకున్న వ్యక్తి సంబంధిత పోస్టాఫీస్‌కు అంగీకార పత్రంతో కూడిన దరఖాస్తు ఫామ్‌ను ఇవ్వాలి. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు బదలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీని సర్టిఫికెట్లో ముద్రిస్తారు.

Gemini Internet

అకౌంట్ ఓపెనింగ్ KVP పథకంలో పెట్టుబడికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. వ్య‌క్తిగ‌తంగా లేదా ఉమ్మ‌డిగా ఖాతా ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరుచుకోవచ్చు. పదేళ్లు నిండిన‌ పిల్లల పేరుతో మైనర్ ఖాతాను తెరువవచ్చు. పిల్ల‌ల త‌ర‌పున తల్లిదండ్రులు లేదా గార్డియ‌న్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. నామినీని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. ఖాతా తెరిచేందుకు, ద‌ర‌ఖాస్తు ఫాంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లో ఏదైనా గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. అకౌంట్ తెరిచిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల తర్వాత షరతులకు లోబ‌డి ముంద‌స్తు ఉపసంహరణకు అనుమతిస్తారు.

వడ్డీ రేటు నిర్ణయం ఈ స్కీం వ‌డ్డీరేటును కేంద్రం నిర్ణ‌యిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటును సవరిస్తుంది. అకౌంట్ తెరిచే స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీరేటు కాల‌ప‌రిమితి మొత్తానికి వర్తిస్తుంది. ఉదాహర‌ణ‌కు ఒక వ్య‌క్తి కిసాన్ వికాస్ ప‌త్ర ఖాతాను జ‌న‌వ‌రి-మార్చి 2020 త్రైమాసికంలో ఓపెన్ చేస్తే మెచ్యూరిటి వ‌ర‌కు వార్షికంగా 7.6 శాతం వ‌డ్డీ ఉంటుంది. కొత్త‌గా అంటే ప్ర‌స్తుత త్రైమాసికంలో ఖాతా తెరిచే వారికి వార్షికంగా 6.9 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇదే వ‌డ్డీ మెచ్యూరిటీ వరకు ఉంటుంది. త్రైమాసికంలో KVP వ‌డ్డీ రేటును 7.6 శాతం నుండి 6.9 శాతానికి త‌గ్గించారు. అప్ప‌టి నుండి అదే వ‌డ్డీ రేటును కొనసాగిస్తున్నారు.

నష్టభయం లేదు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాలో రాబ‌డికి న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. అందుకే జీరో రిస్క్‌తో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారు ఈ ఖాతాను ఎంచుకోవ‌చ్చు. పెట్టుబ‌డులు వైవిధ్యంగా ఉండాలంటే పోర్ట్‌ఫోలియోలో కొంతభాగం రిస్క్‌లేని పెట్టుబ‌డులు ఉండాల‌నేది నిపుణుల సూచన. 18 ఏళ్లు నిండినవారు కిసాన్ వికాస్ పత్రను ఓపెన్ చేయవచ్చు. మైనర్ పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.


Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, అనంతపురంలో పదోతరగతి, ఇంట‌ర్‌ అర్హత‌తో 76 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. అనంతపురం ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 76

పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, థియేటర్‌ ఆర్టిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌/పారా మెడికల్‌ బోర్డ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

for application and notification Visit Gemini Internet, D L Road, Hindupur 

Gemini Internet

26, నవంబర్ 2021, శుక్రవారం

DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు.


ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Step 2: అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 3: అనంతరం అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో పంపించాల్సి ఉంటుంది.

Step 4: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.


ఎంపిక ఎలా చేస్తారంటే..

-అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు.

-ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు.

-ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.

S.No.ట్రేడ్ఖాళీలు
1డ్రాట్స్ మెన్(Draughtsman (Civil)1
2మెకానిక్ మెకాట్రానిక్స్1
3ఇన్స్ట్రుమెంట్ మెకానిక్1
4మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్3
5మెకానిక్(Embedded Systems and PLC)1
6ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్)1
7హౌస్ కీపర్1
8ఫిట్టర్7
9మెషినిస్ట్4
10టర్నర్3
11కార్పెంటర్1
12ఎలక్ట్రీషియన్8
13ఎలక్ట్రానిక్స్ మెకానిక్8
14మెకానిక్ మోటర్ వెహికిల్2
15వెల్డర్6
16కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్2
17కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్3
18డిజిటల్ ఫొటోగ్రాఫర్3
19సెక్రెటేరియల్ అసిస్టెంట్3
20స్టేనోగ్రాఫర్1

Gemini Internet

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (FIRST LEVEL) NATIONAL TALENT SEARCH EXAMINATION

డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP. అమరావతి నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (మొదటి స్థాయి) కోసం దరఖాస్తు చేసుకోండి
పర్టిక్యులర్స్ స్కూల్ I'd మరియు పాస్‌వర్డ్ అవసరం
అభ్యర్థి ఆధార్
కుల ధృవీకరణ పత్రం
NMMS హాల్‌టికెట్ నెల మరియు పరీక్ష సంవత్సరం
U DISE కోడ్
HM ఫోన్ నంబర్
నేను పాఠశాల ఇమెయిల్
I. గడువు తేదీలు
a) 29-10-2021 నుండి దరఖాస్తు ఆన్‌లైన్ సమర్పణ
b) 30-10-2021 నుండి చెల్లింపు చేయవచ్చు
c) సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా అభ్యర్థి దరఖాస్తును అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ 30-11-2021
d) ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 01-12-2021

e) O/oలోని ఇతర ఎన్‌క్లోజర్‌లతో పాటు ముద్రించిన నామినల్ రోల్స్‌ను సమర్పించడానికి చివరి తేదీ. పాఠశాలకు సంబంధించిన జిల్లా విద్యా కార్యాలయం (HMలు/ప్రిన్సిపల్స్/కరస్పాండెంట్) 06-12-2021

Gemini Internet

II: సాధారణ సమాచారం

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఫస్ట్ లెవెల్)ని డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP, విజయవాడ NCERT, న్యూ ఢిల్లీ ఆదేశాల మేరకు NMMS పరీక్షతో పాటు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు. కోవిడ్ -19 కారణంగా ఈ సంవత్సరం పరీక్ష షెడ్యూల్ చేయబడింది. జనవరి నెలలో నిర్వహించాలి.

రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో X స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరూ పరీక్ష రాయవచ్చు.

ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) కింద నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా స్కాలర్‌షిప్‌కు అర్హులు, విద్యార్థులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే (నిర్దిష్ట సంవత్సరం జూలై 1 నాటికి), విద్యార్థికి ఉద్యోగం లేదు మరియు ఆమె/అతను తరగతికి హాజరవుతున్నారు. మొదటి సారి X పరీక్ష.

స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ప్రతి సంవత్సరం NCERT కేటాయిస్తుంది. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మరియు NCERT ఇచ్చిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం రెండవ స్థాయికి ఎంపిక చేయబడతారు.

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2000 మంది అభ్యర్థులు సెకండ్ లెవల్ పరీక్షలో ఎంపికవుతున్నారు.