14, నవంబర్ 2023, మంగళవారం

ప్రైవేటు మరియు విదేశీ ఉద్యోగాలు మీ సొంత విచక్షణతో అప్లై చేసుకోండి Private and Abroad Jobs try at your own risk

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు!

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు


వార్షిక వేతనం రూ.13 లక్షలు  


ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చినవారు ఏడాదికి రూ.13 లక్షల వేతనం అందుకోవచ్చు. పదోన్నతులతో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒకటి. ఎయిర్‌ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్‌ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్సెస్‌ టెస్టు, సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్టు, మెడికల్‌ టెస్టు, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి. శిక్షణలో ఉన్నప్పుడు ఐసీఏవో లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ లెవెల్‌ 4 (ఆపరేషనల్‌)లో ఉత్తీర్ణత సాధించాలి.  



పరీక్ష ఇలా

ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్‌ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఏలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ 15, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్‌2 స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ నుంచి కాన్సెప్ట్‌, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ ఏ, బీ ఒక్కో దానికీ 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. రుణాత్మక మార్కులు లేవు.


సన్నద్ధత

  •  పార్ట్‌ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి.
  •  పార్ట్‌ ఏలో ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్ష స్థాయిలో వీటిని అడుగుతారు.
  •  ఐబీపీఎస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్‌ అభ్యర్థులు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను సులువుగానే
  • ఎదుర్కోవచ్చు.
  •  ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  •  గతంలో నిర్వహించిన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏటీసీ ప్రశ్నపత్రాలు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. పరీక్ష, ప్రశ్నల తీరు, సన్నద్ధతపై అవగాహన వస్తుంది.
  • జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ విభాగంలో వర్తమానాంశాలతోపాటు విమానయానం, ఎయిర్‌ పోర్టులకు సంబంధించిన ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
  •  సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షలోపు కనీసం పది మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు తగ్గించుకోగలిగితే విజయానికి అవకాశం ఉంటుంది.
  •  రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలను సైతం ఆలోచించి, ఏదో ఒక జవాబు గుర్తించుకోవచ్చు.

    ముఖ్య వివరాలు

ఖాళీలు: 496. వీటిలో విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 199, ఓబీసీ ఎన్‌సీఎల్‌ 140, ఈడబ్ల్యుఎస్‌ 49, ఎస్సీ 75, ఎస్టీ 33 ఉన్నాయి. వీటిలోనే దివ్యాంగులకు 5 కేటాయించారు.
అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి) కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఆంగ్ల భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు అవసరం.
వయసు: నవంబరు 30, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. ఏఏఐలో ఏడాది అప్రెంటీస్‌ పూర్తిచేసినవారికీ ఫీజు మినహాయించారు.  
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.aai.aero/en/careers/recruitment

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సైనిక్‌ స్కూళ్ల మార్గం రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

రక్షణ కొలువుకు దారి

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు.

సైనిక్‌ స్కూళ్ల మార్గం

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.

దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి.  వీటిలో ప్రవేశానికి పరీక్ష తప్పనిసరి. దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. అలాగే కొత్తగా ప్రారంభమైన 19 సంస్థల్లో ఆరో తరగతిలోనే విద్యార్థులను చేర్చుకుంటారు. వీటికి సైనిక్‌ స్కూల్‌ సొసైటీ నిబంధనలు జారీ చేస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రతి పాఠశాల కనీసం 40 శాతం సీట్లను ఆల్‌ ఇండియా మెరిట్‌ లిస్టు ప్రకారం భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం... ఇలా పలు విభాగాల్లో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఫీజు ఒకేలా ఉండదు.

ప్రయోజనాలెన్నో

ప్రభుత్వ పరంగా జరుగుతోన్న ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ శాతం రక్షణ రంగంలోనే ఉంటున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులతోపాటు సీఏపీఎఫ్‌లోకివచ్చే.. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ...తదితర విభాగాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎక్కువ నియామకాలు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఉంటాయి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ వీటిలో అత్యంత ముఖ్యమైనది. అలాగే ఆర్మీలో గ్రూప్‌ ఎక్స్‌, వై. నేవీలో సెయిలర్‌-ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ. ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌ మెన్‌ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు.
ఈ ప్రకటనలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు హైస్కూల్‌ నుంచే సరైన శిక్షణ పొందితే సులువుగా విజయం సాధించగలరు అందువల్ల ఈ పరీక్షల్లో సైనిక్‌ పాఠశాల నేపథ్యం ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది విజయవంతమవుతున్నారు. ఈ స్కూళ్ల పర్యవేక్షణ రక్షణ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినవారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటు క్రీడలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలవుతుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి బాలికలూ దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదిలో చేరడానికి బాలురే అర్హులు. పరీక్షలో ప్రతిభ, మెడికల్‌ టెస్టులతో విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష ఇలా

ఆరో తరగతికి: పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 125 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఐదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. జీకే (సైన్స్‌, సోషల్‌) 25, లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు/ హిందీ.. ఇలా నచ్చిన భాష ఎంచుకోవచ్చు) 25, ఇంటెలిజెన్స్‌ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు.

తొమ్మిదో తరగతికి: 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్‌, ఇంటెలిజెన్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది.

రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్‌ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.


సీట్లు.. ఫీజు

మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్‌ స్కూల్‌ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 78, తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 105, తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్‌ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు మినహాయించడం చేస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన ఆదానీ వరల్డ్‌ స్కూల్‌ నెల్లూరులో ఆరో తరగతిలోకి 80 సీట్లు కేటాయించారు.


ఏయే అర్హతలు?

ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2024 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2012 - మార్చి 31, 2014 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2009 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారు అర్హులు.


దరఖాస్తులు: డిసెంబరు 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.


పరీక్ష తేదీ: జనవరి 21  

పరీక్ష కేంద్రాలు: ఏపీలో..అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌.

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AISSEE/

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

తాజా ఇంటర్న్‌షిప్‌లు Internship Jobs Do not pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

తాజా ఇంటర్న్‌షిప్‌లు

అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌ కీపింగ్‌

సంస్థ: నిధి ఎస్‌ జైన్‌ అండ్‌ కంపెనీ

ప్రదేశం: గుంటూరు, వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.7,500

దరఖాస్తు గడువు: నవంబరు 15

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం


విజయవాడలో

ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుశల్‌ స్పేసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 16

అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వెర్టొ

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: నవంబరు 16

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, గూగుల్‌ అనలిటిక్స్‌, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ నైపుణ్యాలు


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: వల్లూరి నాగవెంకటసాయి అవినాష్‌ చౌదరి

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: నవంబరు 20

అర్హతలు: ఫీల్డ్‌ సేల్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు


గుంటుపల్లి, విజయవాడల్లో

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఈకంప్‌సిస్‌ ఇండియా

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 18

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేెక్వెరీ, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు


విశాఖపట్నంలో

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 17

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆపరేషన్స్‌

సంస్థ: సొల్యూషన్‌ గ్రాఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 22

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు Govt Jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీలో..

మేఘాలయలోని నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ (ఎన్‌ఈహెచ్‌యూ) 154 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సెక్షన్‌ ఆఫీసర్‌- 07
  • అసిస్టెంట్‌- 06
  • ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌- 06
  • ప్రైవేట్‌ సెక్రటరీ- 07
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌- 02
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌- 01
  • స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌- 05
  • స్టెనోగ్రాఫర్‌- 6
  • సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌- 26
  • జూనియర్‌ లైబ్రరీ అసిస్టెంట్‌- 1
  • లైబ్రరీ అటెండెంట్‌- 11

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2023.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 12.12.2023.

వెబ్‌సైట్‌: https://nehu.ac.in/


హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రీజనల్‌ సంస్థలో..

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 85 గ్రూప్‌ ‘బి’, ‘సి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీలు: అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, స్టోర్‌ కీపర్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, రేడియోగ్రాఫర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌), జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌), ఫిజియోథెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, వార్డెన్‌/ లేడీ వార్డెన్‌, టెక్నీషియన్‌ (ఎండోస్కోపీ/ కొలనోస్కోపీ), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత/ ఆన్‌లైన్‌ పరీక్ష తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2023.

వెబ్‌సైట్‌: https://nehu.ac.in/https://nehu.ac.in/


ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌ పోస్టులు

పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పార్వతీపురం మన్యం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
2. లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ అధికారి
3. కౌన్సెలర్‌
4. సోషల్‌ వర్కర్‌
5. అకౌంటెంట్‌
6. డేటా అనలిస్ట్‌
7. ఔట్‌రీచ్‌ వర్కర్స్‌
8. మేనేజర్‌/ కోఆర్డినేటర్‌ (మహిళ)
9. నర్సు (మహిళ)
10. సోషల్‌ వర్కల్‌ కం ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌ (మహిళ)
11. డాక్టర్‌ (పార్ట్‌ టైమ్‌) 11. ఆయా (మహిళ)
12. చౌకీదార్‌ (మహిళ)
13. అధికారి-ఇన్‌ ఛార్జి (సూపరింటెండెంట్‌)
14. స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్‌
15. పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌
16. ఎడ్యుకేటర్‌
17. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌
18. కుక్‌
19. హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌
20. హౌస్‌ కీపర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2023.

వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/


కృష్ణా జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర

చిలీపట్నంలోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో 8 సాగర మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు: బీఎఫ్‌ఎస్సీ లేదా బీఎస్సీ (ఫిషరీస్‌ సైన్స్‌/ మెరైన్‌ బయాలజీ/ జువాలజీ).  

వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, మచిలీపట్నం, కృష్ణా జిలా’్ల చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/


మహిళ, శిశు సంక్షేమంలో..

ఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
2. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
3. లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌
4. సోషల్‌ వర్కర్‌ (మేల్‌)
5. డేటా అనలిస్ట్‌
6. అవుట్‌రీచ్‌ వర్కర్‌ (మహిళ)
7. నర్సు
8. డాక్టర్‌ (పార్ట్‌ టైమ్‌)
9. చౌకీదార్‌ (మహిళ)
10. డేటా ఎంట్రీ ఆపరేటర్‌

అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


రాజమహేంద్రవరంలో అకౌంటెంట్‌లు

రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్సీఎస్సీఎల్‌) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 2 అకౌంటెంట్‌ గ్రేడ్‌-3 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విద్యార్హత: ఎంకాంతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్‌.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, కలెక్టరేట్‌ కాంపౌండ్‌, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 18-11-2023.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రక్తపోటు పెరిగితే? ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. కాబట్టి అధిక రక్తపోటు లక్షణాల కోసం ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

నల్లాలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంలోకి సక్రమంగా స్రవిస్తుంది. ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే ‘హైపర్‌టెన్షన్‌’ అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు. అయితే అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

అధిక బరువు: అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్‌ చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషన్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి: మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్థవ్యస్త జీవనశైలి: సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు: ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే ‘సోడియం’ వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు: హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి: గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం: మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...

• గుండె దడ

• తలనొప్పి, చమటలు పట్టడం

• కళ్లు తిరగటం

• ఆయాసం

చికిత్స తేలికే!

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా రక్తపోటు అదుపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే?

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. ఇలాకాకుండా లక్షణాలు కనిపించలేదు కదా! అని రక్తపోటు కలిగి ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా రోగికి మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోయి లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే?

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించివలసిన నియమాలు...

• మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.

• ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి వండిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌లు లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.

• వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి.

హైపర్‌టెన్షన్‌

ఉప్పు అన్నిట్లోనూ!

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తూ ఉంటాం. నిజానికి ఇలా ఉప్పు అనేదే వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు అనేదే రాదు. ఇలా ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటూ ఉంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

యోగాతో

రక్తపోటు స్థిరత్వం

యోగా వల్ల ఒరిగే అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సాయుధ బలగాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), సీఆర్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్క ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు ఈనెల 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233ని సంప్రదించాలన్నారు.