డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీ కీ సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ డీఎస్సి నిర్వహణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చినది.
ఈ తాజా ప్రకటనతో ఏపీ లో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నిర్వహించడానికి ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.
దీనిలో భాగంగా ఏపీ విద్యాశాఖ జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
ఈ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో ఏపీ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ విద్యా శాఖ సన్నాహాలు చేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి