రైల్వే బోర్డు ఎన్టీపీసీ పరీక్షల నార్మలైజషన్ విధానంలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
డిసెంబర్ 28,2020 నుండి మొదలు కాబోతున్న రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు ఈ నూతన నార్మలైజషన్ విధానం అమలు కాబోతుంది.
గతంలో ఈ నార్మలైజషన్ విధానంలో భారతీయ రైల్వే పరీక్షలకు నిర్వహించిన పరీక్షల షిఫ్ట్ లు అన్నిటిని పరిగణన లోనికి తీసుకునేవారు.
తాజాగా ఇప్పుడు మారిన నూతన నార్మలైజషన్ నిబంధనల ప్రకారం రైల్వే పరీక్షలకు నిర్వహిస్తున్న షిఫ్ట్ లు అన్నిటిలో ఏ షిఫ్ట్ లో అయితే అభ్యర్థులకు ఎక్కువగా మార్కులు వస్తున్నాయో గమనించి ఆ షిఫ్ట్ ను మాత్రమే పరిగణన లోనికి తీసుకోనున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే పరీక్షల ప్రేపరషన్ ను కొనసాగిస్తే మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి