26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

రేపు మాఘపౌర్ణమి- పున్నమి గరుడ సేవ

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

 గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


4 మాడ వీధులు...4 వేదాలు...అందుకే చెప్పులు వేసుకోరాదు..
ఈ 4 మాడ వీధులలో గరుడుని పై స్వామి ఉండగా ...ప్రత్యక్షంగా దర్శించే వారికి సర్వ పాపాలు తొలిగి...ఉత్తమగతులు కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి....అందుకనే గరుడ సేవ రోజు అన్ని లక్షల్లో భక్తులు వస్తారు .

 స్వామి వారి మూల విరాట్ పై ఉండే లక్ష్మీ  హారం ,  సహస్ర నామల మాల కేవలం గరుడుని మీద స్వామి ఉన్న రోజు మాత్రమే వేస్తారు....అవి మాములుగా దర్శించుకోవడం కుదరదు. అందుకే అంత మంది వాటి దర్శనం కోసం వస్తారు..

ఒకొక్క మాడ వీధిలోని.. ఒకొక్క  దర్శనం point  (స్వామి కొన్ని చోట్ల ఆగుతాడు ..హారతి పాయింట్స్ అంటారు..) లో దర్శనం చేసుకోవడం వల్ల ఒకొక్క ఫలితం.
Simple గా చెప్పాలి అంటే....

స్వామి గరుడుని మీద ఉండగా ప్రతి మాడ వీధిలో ...అంటే ఒకే ప్రదక్షిణ మార్గం లో  4 సార్లు... దర్శనము చేస్తే మనిషి 4 తరాల వారికి ఉత్తమ గతులు లభిస్తుంది ఒక గట్టి నానుడి.

 బ్రహ్మోత్సవాల లో అలా ఒకే ప్రదక్షిణ మార్గం లో 4 సార్లు స్వామి ని చూడడం అసాధ్యం...అందుకే పున్నమి గరుడ సేవ లో అలా దర్శించుకోవాలి అని...పండితులు చెప్తారు...


    Santosh..

కామెంట్‌లు లేవు: