తిరుమల: మార్చి నెలకు సంబంధించిన తిరుమల
■ శ్రీవారి కల్యాణోత్సవం,
■ ఊంజల్సేవ,
■ ఆర్జిత బ్రహ్మోత్సవం,
■ సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను
★★ గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
■ భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఈ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరికి) ఆ టికెట్పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అయితే, కల్యాణోత్సవం టికెట్ పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ను ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
*Dept.Of PRO TTD.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
26, ఫిబ్రవరి 2021, శుక్రవారం
TTD News
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి