1, జులై 2021, గురువారం

ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ఐదో తరగతి, బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది: 10.07.2021

 



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)..
Adminissions 
 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి, ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఐదో తరగతి ప్రవేశాలు: మొత్తం సీట్ల సంఖ్య: అన్ని జిల్లాల్లో కలిపి 2480.

ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు: మొత్తం సీట్లు తరగతుల వారీగా: ఆరో తరగతి–582, ఏడో తరగతి–135, ఎనిమిదో తరగతి–121, తొమ్మిదో తరగతి–145.

మీడియం: ఇంగ్లిష్‌
అర్హత: ఆయా తరగతిలో ప్రవేశాలను అనుసరించి ప్రభుత్వ/గుర్తింపు పొంది పాఠశాలల్లో వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దర ఖాస్తు ప్రారంభ తేది: 25.06.2021

దరఖాస్తులకు చివరి తేది: 10.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aptwgurukulam.ap.gov.in/

కామెంట్‌లు లేవు: