2, నవంబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు.

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలోనే జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

నవంబర్ 03, 2023 ఉదయం 9 గంటలకు APSSDC డిస్టిక్ ఆఫీస్ అనంతపురం నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ సంస్థలు మొబైల్స్ మరియు టీం లెస్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరంలో క్యాషియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ అసోసియేట్స్ మరియు డి మార్ట్, స్విగ్గి, విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటి కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై చదువు వారికి అర్హతగా నిర్ణయించారు.

వీటిలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు అనంతపురం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. మరియు అర్హత సాధించిన వారికి 12 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు నెల జీతం అందిస్తారు.పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కంపెనీలలో నూట పది ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం నిరుద్యోగ మహిళలు పురుషులు పాల్గొనవచ్చు. వీటిలో పాల్గొనే వారి వయసును 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం APSSDCవెబ్సైట్ను సంప్రదించవచ్చు.

కామెంట్‌లు లేవు: