27, జులై 2021, మంగళవారం

AP State Cooperative Bank 26 Jobs Recruitment | ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ  : 21 జులై 2021

ఆన్లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 05 ఆగస్ట్ 2021

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ                                               : 05 ఆగస్ట్ 2021

ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ మొదటి వారం లో

పోస్టుల సంఖ్య:

మేనేజర్ విభాగంలో అన్ని కేటగిరీలలో మొత్తం 26 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP State Cooperative Bank 26 Jobs Recruitment

విభాగాల వారీగా అర్హతలు:

అగ్రికల్చర్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో అగ్రికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.

హార్టికల్చర్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో హార్టికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.

వెటర్నరీ:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో  B.Vsc లేదా M.Vsc చేసి ఉండాలి.

ఫిషరీస్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో B.Fsc లేదా M.Fsc చేసి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

36,000 నుండి 60,943 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఎగ్జామినేషన్ సెంటర్స్:

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు

చెల్లించాల్సిన ఫీజు:

SC/ST/PC/EXS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

జనరల్ లేదా BC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. అభ్యర్థులకు గమనిక తప్పనిసరిగా కామెంట్ రాయండి. మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. 

Website

Notification

Apply Now

26, జులై 2021, సోమవారం

ఇండియన్ నేవీ ఎంఆర్ మ్యూజిషియన్ రిక్రూట్మెంట్ 2021 సెయిలర్ ఎంట్రీలో చేరండి | Join Indian Navy MR Musician Recruitment 2021 Sailor Entry

భారత నావికాదళంలో చేరండి సెయిలర్ ఎంట్రీ MR సంగీతకారుడు మెట్రిక్ క్లాస్ 10 రిక్రూట్మెంట్ 2021 పోస్టు కోసం ఆహ్వానించబడ్డారు

Important Dates

  • Application Begin : 02/08/2021
  • Last Date for Apply Online : 06/08/2021
  • Last Date Complete Form : 06/08/2021
  • Exam Date : Notified Soon
  • Admit Card Available : Before Exam 

దరఖాస్తు రుసుము
    
జనరల్ / ఓబిసి: 0 / -
    
ఎస్సీ / ఎస్టీ: 0 / -
    
పరీక్ష రుసుము డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఫీజు మోడ్ ద్వారా మాత్రమే చెల్లించండి.

నేవీ MR సెయిలర్ ఎంట్రీ మ్యూజిషియన్
10
తరగతి (హైస్కూల్) పరీక్ష భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో ఉత్తీర్ణత.
మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
మధ్య వయస్సు: 01/10/1996 నుండి 30/09/2004 వరకు

శారీరక అర్హత వివరాలు
     07
నిమిషాల్లో 1.6 కి.మీ.
    
స్క్వాట్స్ (ఉతక్ బైహతక్): 20
    
ఛాతీ: కనిష్ట విస్తరణ 5 CMS

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవాలి.
మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ముందు విషయాలను గుర్తుంచుకోండి: - 300 మంది అభ్యర్థులు రాత పరీక్ష కోసం పిలిచారు, ఫోటో గ్రాఫ్: బ్లూ బ్యాక్గ్రౌండ్తో మంచి నాణ్యత గల ఫోటో, దరఖాస్తు ఫారం పంపాల్సిన అవసరం లేదు, ఇండియన్ నేవీ ఎంఆర్ మ్యూజిషియన్ సెయిలర్ ఎంట్రీ, 02/2021 అక్టోబర్ బ్యాచ్ రిక్రూట్మెంట్ 2021 అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి: 02 ఆగస్టు 2021 నుండి 06/08/2021 వరకు. మరిన్ని వివరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్ను తప్పక చదవాలి.

for Notification click here

application link will be activated after 02/08/2021

 



పరీక్ష, ఇంటర్వ్యూ లు లేవు, ఏపీ లో సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, జీతం 93,780 రూపాయలు | AP Social Welfare Recruitment 2021 | ఏపీ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.

ప్రకటన ద్వారా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ లో ఖాళీగా  ఉన్న ప్రిన్సిపాల్, టీజీటీ మరియు కేర్ టేకర్  ఉద్యోగాలను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసే పోస్టులకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి చెందిన ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. AP Social Welfare Jobs 2021

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది    :    ఆగష్టు 16, 2021

విభాగాల వారీగా ఖాళీలు  :

ప్రిన్సిపాల్ గ్రేడ్ - II                            -       1

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)      -     38 (SC17 + ST21)

కేర్ టేకర్ (వార్డెన్ )                             -      7 (SC 4 + ST3)

 మొత్తం ఉద్యోగాలు :

వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 46 పోస్టులను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ , బోర్డుల నుండి 55%మార్కులతో  బీఈడి /60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ లను పూర్తి చేసిన అభ్యర్థులు ప్రిన్సిపాల్ గ్రేడ్ -II ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీ. ఎడ్ ఉత్తీర్ణత /55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులను కంప్లీట్ చేసి, ఏపీ స్టేట్ నిర్వహించిన టెట్ పేపర్ -2 లో అర్హత సాధించిన  అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

బీ. ఎడ్ పాస్ /డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కేర్ టేకర్స్ /వార్డెన్స్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

47 సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ / ఎస్టీ కేటగిరి లకు చెందిన అభ్యర్థులు అందరూ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను .

దరఖాస్తు ఫీజు  :

500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

నిర్దేశిత విద్యా అర్హతల పరీక్షల ఉత్తీర్ణత శాతం మరియు మెరిట్ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 21,230 రూపాయలు నుండి 93,780 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

 

23, జులై 2021, శుక్రవారం

టెరిటోరియల్‌ ఆర్మీలో ఆఫీసర్‌ పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021


న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ.. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 19.08.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌–2లో జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌–1 పరీక్షా సమయం 2గంటలు. పేపర్‌–2 పరీక్షా సమయం 2గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌.
పరీక్ష తేది: 26.09.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021

వెబ్‌సైట్‌: www.jointerritorialarmy.gov.in

ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 | స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 55
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.27,700 నుంచి రూ.44,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టñ స్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌), రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం
స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.
రాతపరీక్ష: ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 1. సివిల్‌ లా, 2. క్రిమినల్‌ లా, 3. ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్, ఎస్సే రైటింగ్‌ టెస్ట్‌ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌ పరీక్ష సమయం 3 గంటలు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని 50 మార్కులకుS నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021
పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

TTD Jobs in Telugu | తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 31, 2021

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంనకు చెందిన BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా, కేవలం విద్యా అర్హతల  మార్కుల ఆధారంగా భర్తీ చేసే ఏ ఒప్పంద ప్రాతిపదిక ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టీటీడి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

మంచి స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది  :  జూలై 31, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

మెడికల్ ఆఫీసర్స్      -     3

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

ఆన్లైన్ వెబ్సైటు లో ఉన్న అప్లికేషన్ ఫారం ను నింపి, తదుపరి సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ ను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఎంబీబీఎస్ కోర్సులో సాధించిన  మార్కులు, సర్వీస్ చేసిన ఏరియాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.

ఈ పోస్టుల భర్తీలో ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు లేవు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 35,000 రూపాయలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

To The Director (FAC) ,

BIRRD Trust Hospital,

TTD, Tirupati - 517501.

Website

Notification

22, జులై 2021, గురువారం

హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి నుండి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది | ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది : ఆగష్టు 28, 2021 స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది : సెప్టెంబర్ 26, 2021 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : సెప్టెంబర్ 10, 2021

తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా 55 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు 13 పోస్టులను ట్రాన్స్ ఫర్ విధానంలో భర్తీ చేయనున్నారు. 

           
                           

మంచి వేతనాలు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. AP High court Jobs

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ అమరావతి నగరంలో ఉన్న హై కోర్ట్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు మరియు ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను ఇపుడు తెలుసుకుందాం. 


ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకూ ప్రారంభం తేది       :  జూలై 20, 2021

ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది               :  ఆగష్టు 28, 2021

స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది     :  సెప్టెంబర్ 26, 2021

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది                        :  సెప్టెంబర్ 10, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

డైరెక్ట్ రిక్రూట్మెంట్ :

OC        - 30 (మహిళలు - 10)

OC       -   1

BC -A  -    5 ( మహిళలు - 2)

BC -B  -    5 (మహిళలు -  2)

BC -C  -    1

BC -D  -    3 (మహిళలు - 1)

BC - E -    1

SC      -    5 ( మహిళలు -1)

ST      -    4 ( మహిళలు - 2)

ట్రాన్స్ ఫర్స్ రిక్రూట్మెంట్ :

OC   -   10

SC    -    2 (మహిళలు - 1)

ST   -     1(మహిళలు - 1)

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  లా విభాగంలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం బీసీ / ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ కూ చెందిన అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష, వివా - వాయిస్ లా ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలు వరకూ జీతం అందనుంది .

NOTE :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు - నగరాలు :

తిరుపతి, విజయవాడ , గుంటూరు, కర్నూల్, రాజమండ్రి మరియు విశాఖ పట్టణం.

Website

Notification