19, నవంబర్ 2021, శుక్రవారం

పత్రికా ప్రకటన APSPDCL( విద్యుత్ శాఖ) Hindupur Division

హిందూపూర్ డివిజన్  ప్రజలకు తెలియజేయడం ఏమనగా అతి భారీ వర్షాలు వలన విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటు క్రింది సూచనలను పాటించాలని హిందూపూర్ డివిజన్  విద్యుత్ శాఖ అధికారి  శ్రీ .డి.భూపతి గారు  విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ సమస్యలపై హిందూపూర్ డివిజన్  అంతటా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలియజేశారు

1 వర్షాలు , గాలులు ఎక్కువగా వస్తున్నప్పుడు లేదా నీటి నిలువ ఎక్కువగా ఉన్న చోట కరెంటు స్తంభాలను తాకరాదు మరియు వాటి దగ్గర ఉండరాదు.

2 ఇంట్లో నెమ్ము గా ఉన్న లేదా తడిచిన స్విచ్ బోర్డ్ లను చేతులతో తాకకుండా పొడిగా ఉన్న కట్టె పుల్ల ద్వారా లేదా ప్లాస్టిక్ వస్తువుల ద్వారా స్విచ్ లను వేసుకొని వలెను.

3 కరెంటు వస్తువులను చేతులతో తాకరాదు.

4 రైతులందరూ వారి విద్యుత్ మోటార్ల దగ్గర జాగ్రత్తగా వుండవలసిందిగా కోరుతున్నాము.

5 ఎక్కడైనా కరెంటు లైన్లు తెగి పడిన ,స్తంభాలు విరిగి పడిన సంబంధిత లైను మెన్ కి గాని సంబంధిత సబ్ స్టేషన్ కి గాని కంట్రోల్ రూమ్ లకు గాని వెంటనే తెలియ పరచవలెను.

7 విద్యుత్ సమస్యల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చేసి పరిష్కరించుకోవాలని తెలియజేశారు.

8 ప్రజల సౌకర్యార్థం అతి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్యలపై విద్యుత్ డివిజన్లలో పద్నాలుగు కంట్రోల్ రూమ్ లు డివిజన్  కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్ ను  ఏర్పాటు చేశామని తెలియజేశారు.

విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి పరిష్కరించుకోవాలని తెలియజేశారు.
మండలము పేరు.                                  ఫోన్ నెంబరు
హిందూపూర్                               9866679984           9490398272   
1)
హిందూపూర్ రూరల్                 9440813296   
2)
పరిగి                                               9440813297           7382605435  
3)
లేపాక్షి,                                            9440813298           7382605436
4)
చిలమత్తూరు                           9440813299           7382605437
5)
మడకశిర                                9440813311.          7382605455       

6).   అమరాపురం                                  9440813314           7382605458   
7)
గుడిబండ                                9440813313           7901642841    
8)
రోళ్ల                                       9440813312           7382605452
9)
అగళి                                     9440813315           7382605463
10)
పెనుకొండ                             9440813308           7382605440
11)
సోమందేపల్లి                          9440813309           7382605445
12)
రొద్దం                                    9440813310           7382605446   
13)
హిందూపూర్ టౌన్ -1               9440813294           08556 220722
14)
హిందూపూర్ టౌన్ II               9440813295           08556 220722            

ప్రజలు పైన తెలిపిన విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

Gemini Internet

 

18, నవంబర్ 2021, గురువారం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(ఐఐటీడీఎం).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–03, టెక్నికల్‌ ఆఫీసర్‌–01, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–02, జూనియర్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ టెక్నీషియన్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి వయసు 27–45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.12.2021

వెబ్‌సైట్‌: https://www.iiitk.ac.in/

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: వైవా వాయిస్‌ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
వైవా వాయిస్‌ నిర్వహించే తేది: 06.12.2021

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

Gram Suraksha Scheme: నెలకు రూ.1500 చెల్లిస్తే, చేతికి రూ.35 లక్షలు

పెట్టుబడిదారులకు సురక్షిత, భరోసాతో కూడిన రాబడిని అందించే పథకాల్లో ఇండియా పోస్టాఫీస్ స్కీమ్స్ ఉంటాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పెట్టుబడితో వడ్డీ రేటు తద్వారా రిటర్న్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పని తీరు పైన ఆధారపడవు. కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. సురక్షిత పెట్టుబడులు కావాలనుకునే వారు తమ భవిష్యత్తు కోసం ఇండియా పోస్ట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలాంటి పథకాల్లో గ్రామ సురక్ష పథకం ఒకటి. ఈ పథకం కింద నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ.35 లక్షలు చేతికి వస్తాయి.

Gemini Internet

చేతికి రూ.31 లక్షలకు పైగా

ఈక్విటీ మార్కెట్‌లో రాబడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ పుంజుకుంటే మాత్రం ఇతర సురక్షిత పెట్టుబడి కంటే రాబడి అధికంగా ఉంటుంది. అయితే రిస్క్ తీసుకోలేనివారికి మాత్రం వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పోస్టాఫీస్ స్కీం పథకాలు మంచిది. అందులోను ఎక్కువ వడ్డీ ఉన్న దానిని ఎంచుకోవచ్చు. మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో గ్రామ సురక్ష పథకం.

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ ప్లాన్ అత్యుత్తమ ఎంపిక. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. రాబడులు కూడా కాస్త బాగుంటాయి. నష్టపరిహారం చాలా తక్కువ. ఇండియా పోస్ట్ అందించే గ్రామ సురక్ష పథకం ప్రొటెక్షన్ ప్లాన్ తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని ఇస్తుంది. రూ.1500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ.31 లక్షల నుండి రూ.35 లక్షలు చేతికి వస్తుంది.

ఈ పెట్టుబడికి నిబంధనలు

- భారతీయుడై ఉండాలి. 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయస్సు కలిగిన ఎవరైనా ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

- గ్రామ సురక్ష పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుండి రూ.10 లక్షలు.

- పోస్టాఫీస్ పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా, వార్షికంగా చెల్లించవచ్చు.

- ప్రీమియం చెల్లింపుకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.

- గ్రామ సురక్ష పథకంలో చేరితో రుణాలు కూడా అందుబాటులో ఉంటాయి.

- ఈ పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత దీనిని సరెండర్ చేయవచ్చు. అయితే మెచ్యూరిటీ తీరకముందే సరెండర్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.

బెనిఫిట్ ఇలా..

ఉదాహరణకు ఓ వ్యక్తి పోస్టాఫీస్ పథకంలో పందొమ్మిది ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన గ్రామ సురక్ష పాలసీని కొనుగోలు చేస్తే 55 ఏళ్ల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515 అవుతుంది. 58 ఏళ్లకు రూ.1463, అలాగే 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాలి. 55 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు.

 

 


 
 

 

SBI Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్స్‌తో వ్యక్తిగత రుణాలు.. వెంటనే అకౌంట్లోకి డబ్బులు..!

SBI Loan: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. వివిధ రకాల రుణాలపై ఆఫర్లు అందిస్తోంది. ఇక వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం..

Gemini Internet

SBI Loan: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. వివిధ రకాల రుణాలపై ఆఫర్లు అందిస్తోంది. ఇక వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ. తన వినియోగదారులకు ఇన్‌స్టంట్‌ ప్రీఅప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్స్‌ అందిస్తోంది. ఈ రుణాలు తీసుకునేందుకు అర్హులైన వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం నాలుగు క్లిక్స్‌తోనే ఎస్‌బీఐ నుంచి పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. ఇందుకు ఎస్‌బీఐ తన ట్వీటర్‌ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. అయితే వ్యక్తిగత రుణాలు పొందే వారు తన క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే కొంత వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రుణాలపై మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఫెస్టివల్‌ ఆఫర్‌ కింద రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే లోన్‌ మంజూరైతే డబ్బులు కూడా వెంటనే ఖాతాల్లోకి వచ్చేస్తాయి. అయితే ఈ ఆఫర్‌ అర్హులైన కొంత మందికి మాత్రమే ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. రుణ అర్హత కోసం పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ చివరి నాలుగు అకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. దీంతో మీకు రుణం వచ్చే అవకాశం ఉందా? లేదా అనే విషయం తెలిసిపోతుంది. అలాగే ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా కూడా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు పరిశీలించి మమ్మల్ని సంప్రదిస్తారు. తర్వాత మీ వివరాలతో పాటు ఐడి ఫ్రూప్స్‌ తీసుకుని రుణం మంజూరు చేస్తారు.

 

 

రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో చేతికి రూ.16 లక్షలు

ఇంట్లో కూర్చొని, మీ వద్ద ఉన్న పెట్టుబడితో మంచి రాబడిని పొందాలని భావిస్తున్నారా? తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు చాలా ఉన్నాయి. పలు పోస్టాఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువ, రాబడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పెట్టుబడుల్లో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్. పెట్టుబడి అంటే వ్యాపార సంబంధిత పదం. లాభం లేదా ఫలితం కోసం కొంత మొత్తాన్ని ముందుగానే ఇన్వెస్ట్ చేయడం. రాబడి కోసం ముందస్తుగా పెట్టే మొత్తాన్ని పెట్టుబడి అంటారు. బ్యాంకులు, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, క్రిప్టో మార్కెట్.. ఇలా వివిధ రకాల పెట్టుబడులు ఉన్నాయి.

Gemini Internet

పోస్టాఫీస్ ఆర్డీ పథకం

పోస్టాఫీస్ RD డిపాజిట్ అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100 మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. RD డిపాజిట్ అకౌంట్ పరిమితి అయిదు సంవత్సరాలు. బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి ఆరు నెలలు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీని లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని అకౌంట్ హోల్డర్ ఖాతాలోకి జమ చేస్తారు.

వడ్డీ రేటు ఎంత ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పైన 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రతి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తుంది. అన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు సవరిస్తుంది.
లక్షల రాబడి ఉదాహరణకు ఈ స్కీంలో మీరు ప్రతి నెల రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.16 లక్షలు వస్తుంది. మీరు ప్రతి నెల పోస్టాఫీస్ FDలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు 5.8 శాతం వడ్డీ రేటుతో రూ.16 లక్షలు చేతికి వస్తుంది.


 

 

17, నవంబర్ 2021, బుధవారం

PM KISAN MAAN DHAN: రైతులకు వృద్దాప్యంలో భరోసా.. రూ.3000 పెన్షన్

PM Kisan Maan Dhan: రైతుల వృద్దాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పి ఎం కిసాన్ మన్ ధాన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది

PM Kisan MaanDhan: ఈ పథకం కింద, 60 సంవత్సరాల వయస్సు తర్వాత రైతులకు పెన్షన్ పొందే సౌకర్యం లభిస్తుంది 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలోపు ఏ రైతు అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పించను లభిస్తుంది.

రైతుల వృద్దాప్య జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం పి ఎం కిసాన్ మన్ ధన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది

రైతులకు వృద్దాప్యంలో భరోసా పించన్

ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇస్తారు. మీరు PM కిసాన్ మన్ ధన్ పథకంలో జాయిన్ అయ్యేందుకు ఖాతాదారు ఎలాంటి పత్రాలు సమర్పించనవసరం లేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో ఉన్న అనేక ప్రయోజనాలు

PM కిసాన్ మన్ ధన్ స్కీమ్ వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కింద రైతుకు నెలకు రూ.3000 వరకు పించను లభిస్తుంది.

PM కిసాన్ మన్ ధన్ యోజన కోసం అవసరమైన పత్రాలు

1.    ఆధార్ కార్డ్

2.    ఐడెంటిటీ కార్డ్

3.    వయస్సు దృవీకరణ పత్రం

4.    ఆదాయ దృవీకరణ పత్రం

5.    బ్యాంక్ కాతా పాస్ బుక్

6.    మొబైల్ నెంబర్

7.    పాస్ పోర్ట్ సైజు ఫోటో

ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. PM కిసాన్ మన్ ధన్ కుటుంబ పెన్షన్ కూడా ఉంది. ఖాతాదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది. కుటుంబ పెన్షన్ లో జీవిత భాగస్వామి మాత్రమే చేర్చబడ్డారు అని గుర్తుంచుకోవాలి.

PM కిసాన్ లబ్దిదారుడికి ఎలా ప్రయోజనం చేకూరుతుంది

PM కిసాన్ పథకం కింద, ప్రభుత్వం అర్హులైన రైతులకు 2000 రూపాయలతో 3 విడతలుగా ప్రతి సంవత్సరం  6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తారు. దాని ఖాతాదారుల పెన్షన్ పథకం PM కిసాన్ మన్ ధన్ లో చేరాలనుకుంటే వారికి రిజిస్ట్రేషన్ సులభంగా చేయబడుతుంది. అలాగే రైతు ఈ ఎంపికను ఎంచుకుంటే, పెన్షన్ స్కీములో ప్రతి నెలా మినహాయించబడిన  కంట్రిబ్యూషన్ కూడా ఈ 3 వాయిదాలలో వచ్చిన మొత్తం నుండి తీసివేయడుతుంది. అంటే దీని కోసం PM కిసాన్ మన్ ధన్ ఖాతాదారుడు జేబులోంచి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

 Gemini Internet