♦షెడ్యూల్ మారదు
♦11కు బదులు ఆరు పేపర్లే
♦పరీక్షలు రద్దు కావు
♦ప్రచారాలు నమ్మొద్దు
🌻అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి డా సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష లు జరుగుతుందో తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదో తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్ కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరో గ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి