యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021
భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య: 712
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 21–32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. "
ఎన్నిసార్లు రాయొచ్చు:
జనరల్ అభ్యర్థులు ఆరుసార్లు రాసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఓబీసీలు తొమ్మిదిసార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్ టైమ్), మెయిన్ ఎగ్జామినేషన్(డిస్క్రిప్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 24, 2021
ప్రిలిమినరీ పరీక్ష తేది: 27 జూన్ 2021
ఈ అడ్మిట్ కార్డ్: ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి మూడు వారాల ముందు నుంచి ఈ అడ్మిట్ కార్డ్ యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://upsconline.nic.in
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి