18, మే 2020, సోమవారం

Private Jobs





















No Exam Railway 663 Jobs Notification 2020 | పరీక్ష లేకుండా రైల్వే లో ఉద్యోగాల భర్తీ

COVID-19 కారణంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతో ఈ పోస్టులను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఈస్ట్ రైల్వే హస్పటలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది22 మే 2020

విభాగాల వారీగా ఖాళీలు:

నర్సింగ్ సూపరింటెండెంట్255
ఫార్మసిస్ట్51
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్255

వయస్సు:

నర్సింగ్ సూపరింటెండెంట్20-38
ఫార్మసిస్ట్20-35
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్18-33
sc,st వారికి 5 సంవత్సలు, OBC వారికి 3 సంవత్సరాలవరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

అర్హతలు:

నర్సింగ్ సూపరింటెండెంట్:

జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో మూడు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. లేదా B.Sc నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ అర్హతలు గుర్తింపు పొంది యూనివర్సిటి లేదా బోర్డ్ నుండి చేసి ఉండాలి.

ఫార్మసిస్ట్ :

సైన్స్ సబ్జెక్టు తో లేదా సమానమైన అర్హతతో ఫార్మసిలో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. లేదా బాచిలర్ డిగ్రీ ఫార్మసి లో చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ :

పదోతరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

సంబందిత మెయిల్ అడ్రస్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
srdmohkur@gmail.com

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website

Notification

Forest Jobs Inter, Degree,10th Class Telugu 2020 | ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

Indian Council of Forestry Research and Education

ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు హిమలయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థుల కు జాబ్ వచ్చిన తరువాత హైదరాబాద్ లోని HFRI కి బదిలి చెయ్యడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకొవడానికి చివరి తేది15-Jun-20

విభాగాల వారిగా ఖాళీలు:

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)1
ఫారెస్ట్ గార్డ్5
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)2

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఫారెస్ట్ గార్డ్ :

సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
శారీరక ప్రమాణాలు:
పురుషులు:
1. నడక: 4 గంటల్లో 25 కి.మీ.
2. ఎత్తు కనిష్టంగా 165 సెం.మీ. ఉండాలి. విస్తరణ లేకుండా ఛాతీ 79 సెం.మీ. ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మహిళలు:
1. నడక: 4 గంటల్లో 14 కి.మీ. నడవ గలగాలి అని చెప్పడం జరుగుతుంది.
2. ఎత్తు కనిష్టంగా 150 సెం.మీ.
3. విస్తరణతో ఛాతీ 74 సెం.మీ మరియు విస్తరణతో 79 సెం.మీ.

మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)

10 వ తరగతి పాస్ సర్టిఫికెట్లు.

జీతం:

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 29200-92300
ఫారెస్ట్ గార్డ్స్థాయి – 2 యొక్క 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ ₹ 19900-63200
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 000 18000-56900

ఎంపిక విధానం:

రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి సంబందిత అడ్రస్ కి పంపవలసి ఉంటుంది.

చిరునామ:

ది హెడ్ ఆఫ్ ఆఫీస్, రిక్రూట్‌మెంట్ సెల్, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కోనిఫెర్ క్యాంపస్, పంతఘాటి, సిమ్లా (హెచ్‌పి) – 171013

ఫీజు:

Gen/OBC వారికి 300/-, SC,ST,Ex-servicemen ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
మీకు కావలిసిన జాబ్ ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి.

Website

Notification

 

హిందూపురం వార్తలు | విద్యా | ఉద్యోగ సమాచారం 18-05-2020

ప్రత్యేక పాసులున్నా పల్లెల నుండి కూరగాయలను తీసుకువస్తున్న  రైతులను, పోలీసులు అడ్డుకుని వాహనాలను లాక్కుని కేసులు పెడుతున్నారని, హిందూపురం తహశిల్దారు కార్యాలయం వద్ద కూరగాయలను పారబోసి కూరగాయల వ్యాపార్లు నిరసన వ్యక్తం చేశారు, దీంతో తహశీల్దార్ శ్రీనివాసులు వ్యపారుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించుకున్నారు.

ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో శ్రీవారి దర్శనం వాయిదా పడింది. అయితే భక్తులు దర్శనాలు ప్రారంభమయిన తరువాత భక్తులు భౌతిక దూరంతో స్వామిని దర్శించుకోవడానికి రెండు రోజుల క్రిందట క్యూలైన్లు లడ్డూ కౌంటర్లలో అధికార్లు మార్కింగ్ వేయించారు.

10వ తరగతి తరువాత సాంకేతిక విద్యకోసం ఎపి పాలిసెట్, 10వ తరగతి ఉతీర్ణత లేదా 2020 లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://polycetap.nic.in


యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 136
విభాగాలు వారిగా ఖాళీలు
మైనింగ్ మేట్ సి - 52
అప్రెంటీస్ మైనింగ్ మేట్ - 53
అప్రెంటీస్ లైబ్రరీ అసిస్టెంట్ - 6
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బ ఇ - 14
బ్లాస్టర్ -బి 4
బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ -3
గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ -4
ఆన్ లైన ద్వారా ధరఖాస్తుకు చివరి తేది జూన్ 22
ucil.gov.in

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 50
పోస్టుల వారిగా ఖాళీలు
యంగ్ ప్రొఫెషనల్ - 30
కన్సల్టెంట్ - 20
విభాగాలు
ఐటీ, స్టాటిస్టిక్స్, అడ్మిన్ అండ్ ప్రాజెక్ట్, లీగల్, నేషనల్ అకౌంట్స్
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేది జూన్ 15
http://www.mospi.gov.in/


Indian Council of Forestry Research and Education లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విభాగాల వారిగా ఖాళీల

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)1
ఫారెస్ట్ గార్డ్5
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)2

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి

ఫారెస్ట్ గార్డ్ :

సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి దీనితో పాటు శారీరక ప్రమాణాలను పరిగణాలోనికి తీసుకుంటారు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)

10 వ తరగతి ఉత్తీర్ణత.

వ్రాత పరీక్షద్వారా ఎంపిక చేయబడే ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచ్చు
website http://www.icfre.org/







17, మే 2020, ఆదివారం

పది తెలుగు, హిందీ మోడల్ పేపర్లు, గురుకుల డిగ్రీ విద్య మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్ వివరాలు




హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 17-05-2020


హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న 17 మందిని వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా అస్సాం రాష్ట్ర కార్మికులను శనివారం రాత్రి స్థానిక హిందూపురం తహశిల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపారు.

అత్యవసర వైద్య సేవల కోసం హిందూపురంలోని కంటైన్మెంట్ జోన్ల నుంచి ఆటోల్లో ఆస్పత్రులకు వెళ్ళడానికి అవకాశం కల్పించామని సబ్ కలెక్టరు నిశాంతి తెలిపారు అయితే అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్ళడానికి నిర్ణయించిన ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు, కంటైన్మెంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ప్రజలకు  వైద్య సేవలు అందుతాయని అత్యవసర  వైద్య సేవల కోసం స్థానికంగా ఉన్న నవాజ్ నర్సింగ్ హోం,  తేజా నర్సింగ్, మనోజ్ క్లినిక్, బాలాజి క్లినిక్, శిల్పక్లినిక్, హ్యాపి షైన్, గిరిష్ డెంటల్, శ్రీనివాస నర్సింగ్, శిల్ప నర్సింగ్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చన్నారు.

హిందూపురానికి చెందిన కరోనా సోకిన 17, మరియు 35 ఏళ్ళ మహిళలకు ప్రస్తుత పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బత్తలపల్లి ఆర్ డి టీ ఆసుపత్రిలో నుండి శనివారం డిశ్చార్జ్ చేశారు. వారి 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో  ఉండాలని సూచించామని కలెక్టరు గంధం చంద్రుడు పేర్కొన్నారు.

డి ఎస్సీ 2008 అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే వివరాలను అందజేయాలని డి ఇ ఓ సామ్యూల్ తెలిపారు. మెరిట్ లిస్ట్ ల పై సందేహాల నివృత్తి కోసం సూపరింటెండెంట్ రంగస్వామి 9247719855 సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్ బాషా 9133356786 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు ఎపి రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్ లో ప్రవేశం
ఎంచుకున్న గ్రూపును బట్టి వ్రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం

అర్హతః 2020 లో తెలంగాణ  లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి మొదటి ప్రయత్నంలోనే ఇంటర్మీడియేట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గతంలో ఉత్తీర్ణులయిన వారు అనర్హులు. ప్రత్యేకించి ఇంగ్లీషులో 40 శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బిసీలకు 5 శాతం సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది మే 30

అనంతపురం దగ్గరలోని ప్రసన్నయపల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్ లో ప్రవేశాలు
అందించే కోర్సులు బి ఎ హానర్స్ లో ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, ఎం ఏ ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బి వొకేషనల్ టూరిజం అండ ట్రావెల్ మేనేజ్ మేంట్, బి వొకేషనల్ రిటైల్ మేనేజ్ మెంట్ అండ్ ఐటీ
ప్రవేశ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
దరఖాస్తుకు చివరి తేది మే 23

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR)  జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం ఖాళీలు 150
దరఖాస్తుకు చివరి తేది మే 27

టి హెచ్ డి సీ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ
ట్రెయినీ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 10
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పబ్లిక్ రిలేషన్స్ 4
దరఖస్తుకు చేవరి తేది జూన్ 15
 











16, మే 2020, శనివారం

DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ | జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు

డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.

‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ లిస్టులో ఉండి..  సెలెక్షన్‌ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్‌ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

🔳టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ సైన్స్‌ : ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-1లో 12, సెక్షన్‌-2లో 16, సెక్షన్‌-3లో 32, సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్‌ స్టడీస్‌: సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.

మ్యాథ్స్‌ పేపర్‌: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

🔳జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.