15, ఆగస్టు 2022, సోమవారం

PM-YASAVI Scheme: 15000 పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు | Last Date 26/08/2022

నేటికీ ఎంతోమంది ప్రతిభావంతులు ఫీజుల భారం కారణంగా చదువుకు దూరమవుతున్న పరిస్థితి!! ముఖ్యంగా..పేద విద్యార్థులు..ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. విద్యను మధ్యలోనే ఆపేస్తున్న వైనం! దీనికి పరిష్కారంగా.. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా.. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ తాజాగా ప్రవేశ పెట్టిన పథకమే.. పీఎం యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా ఫర్‌ ఓబీసీస్‌ అండ్‌ అదర్స్‌ (పీఎంయశస్వి)!! ఈ పథకం ద్వారా.. తొమ్మిదో తరగతి, పదకొండో తరగతిలో చేరి.. ప్రతి నెల స్కాలర్‌షిప్‌ పొందొచ్చు. యంగ్‌ ఎచీవర్స్‌ టెస్ట్‌(వైఈటీ) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు ఇటీవల నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పీఎంయశస్వి పథకంతో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...

  • యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు ప్రకటన విడుదల
  • వెనుకబడిన వర్గాలకు ఆర్థిక ప్రోత్సాహం
  • 9, 11 తరగతుల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు
  • ఎన్‌టీఏ నిర్వహించే వైఈటీ ద్వారా అర్హుల ఎంపిక

పీఎం యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా(యశస్వి) పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన టాప్‌ పాఠశాలల్లో చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్‌ ట్రైబ్స్‌(డీఎన్‌టీ) వర్గాలకు చెందిన పిల్లలకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి నెల నిర్దిష్ట మొత్తంలో స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 

  • తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఏటా రూ.75 వేలు; పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు ఏటా రూ.1.25 లక్షలు చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు.
  • ఇలా.. ఏటా జాతీయ స్థాయిలో దాదాపు 15000 మందికి ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.

విద్యార్హత

  • తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 202122లో ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 202122లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి

  • తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 1, 2006 మార్చి 31, 2010 మధ్యలో జన్మించి ఉండాలి.
  • పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 1, 2004  మార్చి 31, 2008 మధ్యలో జన్మించి ఉండాలి.

పాఠశాలలకు ప్రామాణికాలు

ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ వర్గాలకు టాప్‌ క్లాస్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. కాబట్టి సదరు పాఠశాలలకు కొన్ని ప్రామాణికాలను నిర్దేశించారు. సదరు పాఠశాలలో 10, 12 తరగతుల్లో వంద శాతం ఫలితాలు ఉండాలని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఇలాంటి పాఠశాలలను గుర్తించేందుకు జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అంటే.. ఈ స్కాలర్‌షిప్‌ అందుకోవాలంటే.. ఇలాంటి పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుతుండాలి లేదా ప్రవేశం ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులకూ నిబంధనలు

  • పీఎం యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కూడా కొన్ని నిబంధనలు రూపొందించారు. అవి..
  • కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
  • మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 30 శాతం స్కాలర్‌షిప్స్‌ను మహిళా విద్యార్థులకు కేటాయించాలి.
  •  స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉంటేనే తదుపరి ఏడాది స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు.

ఎన్‌టీఏవైఈటీ ఇలా

పీఎం యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో..యంగ్‌ ఎచీవర్స్‌ టెస్ట్‌(ఎన్‌టీఏవైఈటీ)ను నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ను తొమ్మిదో తరగతి, పదకొండో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహిస్తారు.

నాలుగు విభాగాలు.. 400 మార్కులు

  • వైఈటీ పరీక్షను నాలుగు విభాగాల్లో 400 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ 30 ప్రశ్నలు120 మార్కులు, సైన్స్‌ 20 ప్రశ్నలు80 మార్కులు, సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు100 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/నాలెడ్జ్‌  25 ప్రశ్నలు100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. పరీక్షను ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమంలో నిర్వహిస్తారు.
  • తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి సిలబస్‌ ఆధారంగా, పదకొండో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలను రూపొందిస్తారు.

రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా

  • ఎన్‌టీఏ నిర్వహించే వైఈటీలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా.. రాష్ట్రాల వారీగా ఆయా వర్గాలకు నిర్దిష్ట సంఖ్యలో స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తారు. మెరిట్‌ జాబితా, ఆయా వర్గాలకు కేటాయించిన స్కాలర్‌షిప్‌ల సంఖ్య ఆధారంగా ముందు వరుసలో ఉన్న వారికి వీటిని మంజూరు చేస్తారు.
  • ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే విధానం (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) అమలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు సొంతగా బ్యాంకు ఖాతాను కలిగుండాలి. అదే విధంగా ఆధార్‌ కార్డ్‌ కూడా ఉండాలి.

మంచి స్కోర్‌కు మార్గాలివే

వైఈటీలో మంచి మార్కులు సాధించడానికి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఏడు, ఎనిమిది తరగతుల పుస్తకాలు.. పదకొండో తరగతి అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి పుస్తకాలు అభ్యసనం చేయాలి. అన్ని సబ్జెక్ట్‌లలోని ముఖ్యాంశాలను చదవాలి. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌లో ఆయా సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలను చదవాలి. నేచురల్‌ సైన్స్‌కు సంబంధించి వ్యాధులు, బ్యాక్టీరియాలు, మానవ శరీర నిర్మాణం, కణజాలం, కిరణజన్య సంయోగ ప్రక్రియ వంటి కీలకమైన అంశాలను చదవాలి. సోషల్‌ సైన్సెస్‌లో హిస్టరీ, జాగ్రఫీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు.. జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు, నూతన నియామకాలు, సదస్సులు, సమావేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు,క్రీడలువిజేతలు, వ్యక్తులుఅవార్డులు, దేశాలురాజధానులు, దేశాలుకరెన్సీ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివరలో ఉండే కొశ్చన్స్‌/ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది.

వైఈటీకి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు

పీఎం యంగ్‌ ఎచీవర్స్‌ స్కాలర్‌షిప్‌నకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే యంగ్‌ ఎచీవర్స్‌ టెస్ట్‌కు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డ్‌; పుట్టిన తేదీ ధ్రువ పత్రం; ఆధార్‌ నెంబర్‌; విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫొటోగ్రాఫ్‌; సంతకం; కుల ధ్రువీకరణ పత్రం; ఆదాయ ధ్రువీకరణ పత్రం;  దివ్యాంగ విద్యార్థులు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాలి.

ఎన్‌ఐటీవైఈటీ 2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్‌ 26, 2022
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: సెప్టెంబర్‌ 5 నుంచి
  • ఎన్‌టీఏవైఈటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 11(మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు)
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://yet.nta.ac.in, www.nta.ac.in, https://socialjustice.gov.in
Last Date

Gemini Internet

Govt Scholarships: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు.. రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్‌షిప్‌

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీపేద విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్‌షిప్‌ ఇస్తోంది.

అర్హత

  • ఎస్సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ ఇస్తారు.
  • పదో తరగతి పూర్తిచేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
  • విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.
  • విద్యార్థులు చేరే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.
  • భారతదేశంలో చదివే పిల్లలకే ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.
  • దరఖాస్తుల పరిశీలన, ఎంపిక బాధ్యత రాష్ట్రాల పైనే ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వివరాలు

విద్యా స్థాయిని బట్టి స్కాలర్‌షిప్‌ ఉంటుంది. అవి నాలుగు కేటగిరీలలో ఉంటాయి.
1. గ్రూప్‌ 1 (డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌–రూ.7000, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.13,500.
2. గ్రూప్‌ 2 (డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌–రూ.6500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.9500.
3. గ్రూప్‌–3 (గ్రూప్‌ 1, 2 పరిధిలో లేని గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లు): డే స్కాలర్‌–రూ.3000, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.6000.
4. గ్రూప్‌–4 (అన్ని పోస్టు మెట్రిక్యులేషన్, నాన్‌–డిగ్రీ కోర్సులు): డే స్కాలర్‌–రూ.2500, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.4000.

  • దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు అలవెన్స్‌ అందుతుంది.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రిజిస్ట్రేషన్‌ కోసం పోర్టల్‌ 14.04.2022 నుండి తెరిచి ఉంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

Gemini Internet

PM YASASVI Scheme 2022: పాఠశాల విద్యార్థులకు ఎన్‌టీఏ–యశస్వి స్కాలర్‌షిప్‌ | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌(YASASVI) ప్రవేశ పరీక్ష–2022 కోసం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ పాఠశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌లను భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 15,000 మంది విద్యార్థులకు అందజేస్తుంది.

అర్హత

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తొమ్మిది, పదకొండు తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 
  • ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈబీసీ), సం చార, పాక్షిక–సంచార తెగల డీ–నోటిఫైడ్‌ తెగల(డీఎన్‌టీ)కు చెందిన విద్యార్థులే అర్హులు.
  • తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 2.5లక్షలకు మించకూడదు.

పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)విధానంలో జరుగుతుంది.ప్రవేశ పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 3గంటలు. పరీక్ష ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 78 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌  ద్వారా.    

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022
హాల్‌టిక్కెట్‌లు వెలువడే తేది: 05.09.2022
పరీక్ష తేది: 11.09.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://yet.nta.ac/

 

Jagananna Videshi Vidya Deevena Scheme: అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు | ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30.09.2022

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.క్యూఎస్‌ ర్యాంకుల ప్రకారంఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు చదవడానికి   అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సహా ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్, నీట్‌ స్కోర్‌ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
వయసు: 35ఏళ్లకు మించకూడదు.

ఆర్థిక సాయం: వందలోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యా సంస్థలో ప్రవేశాలు పొందితే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://jnanabhumi.ap.gov.in

 

Gemini Internet

LIC HFL Recruitment 2022: ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.80వేలకుపైగా వేతనం | దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌.. పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల వారు ఆగస్టు 25 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ పోస్టులు50; అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు30. 
అర్హత: అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ లేదా పీజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణలవ్వాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లో డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌(డీఎంఈ) విభాగానికి సంబంధించి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఎంబీఏలో మార్కెటింగ్‌/ఫైనాన్స్‌ చేసి ఉండాలి. అలాగే వీరికి సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. రెండు పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 01.01.2022 నాటికి 2128 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. డీఎంఈ పోస్టులకు 2140 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
వేతనాలు: అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.33,960 వేతనంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.80,100 వేతనంగా పొందవచ్చు.వీటికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

నాలుగు విభాగాలు 
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో 50 ప్రశ్నలు50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 35 నిమిషాలు. 
లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో 50 మార్కులకు 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 35 నిమిషాలు. 
జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 15 నిమిషాలు.
న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులుంటాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022
  • వెబ్‌సైట్‌: https://www.lichousing.com/

Gemini Internet

Andhra Pradesh Govt Jobs: 1681 పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1681
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌(సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేయాలి.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18నుంచి 35ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/

 

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి



 

Gemini Internet