AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు
* ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు
ఈనాడు ప్రతిభ డెస్క్: భారతదేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో రాత పరీక్షల నిర్వహణలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి