Alerts

--------

10, డిసెంబర్ 2020, గురువారం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు లని రైతులు ఎందుకు వద్దు అంటున్నారో తెలుసుకోవాలి అంటే

.
Vashista Infinity రాసిన ఈ పోస్ట్ చదవండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి
"తిన్నది అరగక, ఎక్కడ పని లేక, వాపుని చూసుకొని బలుపు అని భ్రమలో చేస్తున్న ఉద్యమమే ఈ పంజాబ్ రైతుల ఆందోళన"

"ఢిల్లీ పక్కనే కూత వేటు దూరంలో ఉంది కాబట్టి, 96వేల ట్రాక్టర్లు వేసుకొని వచ్చి, షో ఆఫ్ చేస్తున్నారు".

"దేశంలో 29 రాష్ట్రాల రైతులకు లేని కడుపు నొప్పి ఈ సర్దార్ గాళ్ళకు ఎందుకో అంత ఇది".

ఇలా నానా మాటలు అంటు, ఒక ప్రజా ఉద్యమాన్ని, దేశానికి అన్నం పెట్టే రైతుని కించపరుస్తున్నారు చాలా మంది.

అసలు పంజాబ్ రైతులే ఎందుకు అంతలా ఆందోళన చేస్తున్నారు, మిగితా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనే విషయం నేను చెప్తాను వినండి.

కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు చేసింది. ముందు వాటి మీద మనకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత రైతుల ఆందోళన ఎందుకో అర్ధం అవుతుంది.

1. వ్యవసాయ స్వేచ్ఛయుత మార్కెట్ చట్టం :- ఈ చట్టం రైతులకు వాళ్ళు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఇస్తుంది. అంటే ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు. టాక్స్ ఉండదు. అంటే one nation one market. ఇక్కడి వరకు బాగుంది కానీ ఈ చట్టంలో రైతులకు ప్రభుత్వం ప్రతి పంట మీద ఒక మద్దతు ధర నిర్ణయించి ఇస్తుంది, దాన్నే minimum support price అంటారు. బక్క చిక్కిన చిన్న సన్న కారు రైతులకు ఇప్పుడు ఈ చట్టంలో ఆ రక్షణ లేదు. అసలు MSP అనే పదమే లేదు. రైతు తాను పండించిన పంటను APMCలో అంటే మార్కెట్ యార్డులో అమ్ముకుంటే తనకు కనీస మద్దతు ధర వస్తది కానీ ఇలా బయట అమ్మడం మొదలుపెడితే తన బ్రతుకు కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తారు అనే భయం మొదలయింది. 

మరి పంజాబ్ రైతులే ఎందుకు భయపడుతున్నారు మిగితా రాష్ట్రాల రైతులు ఎందుకు కనీసం పట్టించుకోవట్లేదు అంటే, ఇతర రాష్ట్రాల్లో రైతులు 90% వరకు వాళ్ళు పండించిన పంటకు ఆల్రెడీ ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు. కేవలం 10% రైతులే మార్కెట్ యార్డులో అమ్ముతున్నారు. కానీ పంజాబ్లో పరిస్థితి భిన్నంగా ఉంది, 90% రైతులు తమ పంటను మార్కెట్ యర్డ్స్ APMC లో మాత్రమే అమ్ముకుంటారు. అక్కడ వాళ్లకు MSP రక్షణ ఉంటుంది. రైతు సంఘాలు క్రియాశీలకంగా ఉంటాయి కాబట్టి కేవలం పంజాబ్లోనే దేశం మొత్తం మీద ఉన్న APMC మార్కెట్ యార్డులు 33% పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్లకు ఈ APMC లు దూరం అయితే MSP కనీస మద్దతు ధర దూరం అవతది అనే భయం, ఆందోళన ఉంది. వాళ్ళు ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు అంటే, MSP అనే క్లాస్ చట్టంలో స్పష్టంగా పొందుపరచాలి, దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టొద్దు అని.

వాళ్ళు ఇంతలా ఆందోళన చెందడానికి, ఆందోళన చేయడానికి కారణం, 2006లో బిహార్లో ఈ ఫ్రీ మార్కెట్ చట్టం చేసి, అక్కడి రైతులకు APMC మార్కెట్ యార్డులు దూరం చేసారు, వాళ్ళు పండించిన పంటను ప్రైవేట్ వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఒక సెల్ ఫోన్ కంపెనీ వాడు తాను తయారు చేసిన ప్రొడక్ట్ ఎంతకు అమ్మలో వాడే నిర్ణయిస్తాడు కానీ ఒక రైతు మాత్రం, తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎవడో అంబానీ, అదాని గాడు వచ్చి నిర్ణయిస్తే మేము ఎలా ఉరుకుంటాం అనే ఆత్మ గౌరవం నుండి పుట్టిందే ఈ పంజాబ్ రైతుల ఆందోళన.
ఈ ముసలాయనకు ఎక్కడ పనిలేక, ఎముకలు కొరికే చలిలో ఈ వయసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నాడు అనుకుంటున్నారా...???

2.కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా ఒప్పంద వ్యవసాయ చట్టం :- 

ఈ చట్టం కింద రైతులు కొంతమంది బడా కార్పొరేట్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. అదేంటంటే. ఆ సంస్థలు చెప్పిన పంట పండిస్తే, రైతులకు పంట పెట్టుబడి సాయం ముందే కలిపిస్తారు, పంట పండిన తర్వాత ఆ పంటను ఆ కంపెనీ కొనే బాధ్యత తీసుకుంటారు. పంట వేసే ముందే ధర కూడా నిర్ణయిస్తారు. ఒకవేళ మార్కెట్లో ఆ పంటకు ధర పడిపోయిన, ఆ కంపెనీ మాత్రం వాళ్లకు ముందు కుదుర్చుకున్న ధరనే ఇస్తుంది. 

అంత బాగానే ఉంది కదా మరి, ఇంకా సమస్య ఏంటి అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్న, సమస్యలు అన్ని ఒక్కొక్కటిగా క్లియర్ గా తెలుసుకుందాం.

1. రైతు ఏ పంట పండిచాలో బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తాయి. అంటే రైతు తనకు నచ్చిన పంట పండించే వెసులుబాటు కోల్పోతాడు, అంటే కంపెనీ చేతిలో కీలు బొమ్మ ఐపోతాడు. 

2. రైతుకు ఆహార భద్రత ఉండదు, ఎందుకంటే మన దేశంలో 86% రైతులు చిన్న కమతాల ఉన్న చిన్న సన్న కారు రైతులు. ఒకవేళ ఈ ఒప్పందం వ్యవసాయం చేస్తే రైతులు, ఇప్పుడు ఇంటి పూర్తి వరకు పండించే ఆహార పంటలు పండించుకోలేడు. వాణిజ్య పంటల ఊబిలో పడిపోయి తన ఆహార భద్రత కోల్పోతాడు.

3. కంపెనీ వాడు చెప్పినట్లు మిర్చి, పత్తి, ఆలుగడ్డ, సొయా లాంటి వాణిజ్య పంటలు పండించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, కంపెనీ వాడు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు వాడి ఆ రైతు తన భూమిని గుళ్ల చేసుకుంటాడు. ఎక్కువ ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువ రసాయన మందులు వాడి, భూమి సారం కోల్పోతాడు.

4. ఒకప్పుడు తెలంగాణ లాంటి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా తృణ ధాన్యాలు(ఉలువలు, సజ్జలు,రాగులు,జొన్నలు) పండేవి, కానీ హరిత విప్లవం మోజులో పడిపోయి తెలంగాణ రైతులు తమ సంప్రదాయ పంటలను, ఆహార భద్రతను కోల్పోవడమే కాకుండా, వీపరితమైన నీళ్లు అవసరం ఉండే పంటలు వేసి, వాటికోసం అప్పులు తెచ్చి బోర్లు వేసి, ఆ ఫెయిల్ అవ్వడంతో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే పంజాబ్లో కూడా జరిగింది.

5. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనం లొట్టలేసుకొని తినే lays packet తయారు చేసే pepsico company వాళ్ళు పంజాబ్ రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మేము ఇచ్చే హైబ్రిడ్ ఆలు గడ్డలు పండిస్తే మీకు మార్కెట్ కంటే ఎక్కువ ధర ఇస్తాం అని. అలాగే ఒకటి రెండు సార్లు ఇచ్చారు కూడా కానీ ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లో వీటికి అంత ధర పలకడం లేదు, మేము ఇవ్వలేం అని చేతులు ఎత్తేసారు. అక్కడి రైతులకు ఆత్మహత్యలే మిగిలాయి. ముందు ఆశ చూపించి ఆ తర్వాత ఆకు నాకిస్తారు ఈ కార్పొరేట్ కంపెనీలు.

6. మరి ఈ కంపెనీలు మోసం చేస్తే న్యాయం కోసం న్యాయస్థానాలు లేవా అంటే, లేవు అనే చెప్పాలి ఎందుకంటే ఈ చట్టంలో సెక్షన్ 19 ప్రకారం సివిల్ న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకోరాదు, అంటే seperate ట్రిబ్యునల్ ఉంటుంది దానికి వెళ్లి కేస్ వేయాలి. రెండు ఎకరాలు ఉన్న బక్క చిక్కిన రైతు, 20లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వెంట్రుక కూడా పీకలేడు కదా. ఈ ప్రాసెస్ లో రైతు ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం కోల్పోయి, మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటాడు

7. 55% జనాభా వ్యవసాయం మీద ఆధారపడే ఈ దేశంలో రైతు తన భూమిలో తాను ఒక కూలీ వాడు ఐపోతాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ బిహార్లో నీలి మందు(indigo) మాత్రమే పండిచాలి అని నిబంధన పెట్టి అప్పట్లో ఎలా అయితే రైతుల్ని ఆహార భద్రత కోల్పోయేలా చేసిందో ఈ చట్టం కూడా ఇప్పుడు రైతుల నడ్డి విరవడానికే అని మరిచిపోవద్దు.

పొద్దున లేస్తే ఈ దేశాన్ని అంబానీ దోచుకుంటున్నాడు, అదాని దోపిడీ చేస్తున్నాడు అని అందరు అరిచి గీపెట్టి ఆఖరికి వురుకుంటారు, పెద్దగా సీరియస్ గా పట్టించుకోరు. కానీ......

 ఇప్పుడు వాళ్ళు అన్నం పెట్టే రైతుల మీదకు వచ్చారు. ఇప్పుడు కూడా వురుకున్నావో, రేపు నీ ఆకలి చావుకు నువ్వే కారణం అవుతావు గుర్తుపెట్టుకో.

3. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ 2020 :- 

ఇంతకు ముందు ఉన్న essential commodities చట్టం ప్రకారం, ఎవరు ప్రభుత్వం విధించిన పరిమితి కంటే ఎక్కువగా ఆహార ధాన్యల్ని, నిత్యావసర వస్తువుల్ని నిలువ చేసుకోవడానికి వీలులేదు. దీన్ని MRTP  monopoly restrictive trade practices అంటారు, అంటే అక్రమంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నిత్యావసర వస్తువుల్ని నిలువ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించి, మార్కెట్లో ఆ వస్తువుల ధర వీపరితంగా పెరిగిన తర్వాత ఆ వస్తువుల్ని అమ్ముకునే వ్యాపారస్తులను నియంత్రించే చట్టం. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం, నిత్యావసర సరుకులను అందరికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.

కానీ ఇప్పుడు చేసిన కొత్త చట్టంలో ఈ నియంత్రణ అనే అంశాన్ని ఎత్తివేసారు అంటే వ్యాపారస్తులు వారికి నచ్చినట్లు, నచ్చినంత నిలువ చేసుకోవచ్చు. వారికి అవసరం ఉన్నప్పుడు అవసరమైన వారికి అమ్ముకోవచ్చు. అంటే వ్యాపారస్తుల మీద ప్రభుత్వానికి నియంత్రణ ఉండదు. ఒకవేళ ఆ వ్యాపారస్తులను నియంత్రించాలంటే నిత్యావసర సరుకుల ధరలు 50% పెరగాలి లేదా యుద్ధం కానీ ఏదైనా విపత్తు కానీ రావాలి, అప్పుడే ప్రభుత్వం వీటి మీద అజమాయిషీ ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోదు, చేసుకునే వీలు లేదు.

మరి ఇలా నిత్యావసర వస్తువులను, బడా కార్పొరేట్ సంస్థలు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తది అన్నమాట. సరే ఇదంతా వ్యాపారం అలాగే ఉంటుంది అనుకుందాం. అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ బడా కార్పొరేట్ వ్యాపార సంస్థలు రేపు మార్కెట్లో కావాలని కృత్రిమ కొరత సృష్టించి, అందరు సిండికేట్ అయిపోయి. నిత్యావసర వస్తువుల ధరలను వీపరితంగా పెంచితే, అటు రైతు ఇటు వినియోగదారుడు ఎంత నష్టపోతారు. మధ్యలో ఈ కార్పొరేట్ సంస్థలు ఇద్దరితో వ్యాపారం చేసి ఎంత దోచుకుంటారు ప్రజల్ని ఒక్కసారి ఆలోచించండి. మొదట అందరు jio sim ఫ్రీ, ఆఫర్లు అన్ని ఫ్రీ అని కొన్నారు, ఇప్పుడు ఏమైందో చూసారు కదా. రేపు అదే జరుగుతుంది కూడా. ఇప్పటికే మన దేశం పేద దేశం అని దేశ ప్రధానులు ఒప్పుకుంటున్నారు, దేశంలో ఆకలి చావులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే వెనకబడి ఉన్నాం( కావాలంటే గూగుల్ చేసి సెర్చ్ చేయండి). 

ఇదంతా ఇంకా క్లియర్ గా అర్ధం కావాలంటే మీకు 1943 great bengal famine గురించి తెలియాలి.

 బెంగాల్ ప్రజలు 30 లక్షల మంది 1943లో వచ్చిన కరువులో ఆకలితో ఆహకరాలు చేస్తూ ఎండిన డొక్కాలతో, అస్థి పంజరాళ్ల  తయారు ఐయ్యి చనిపోయారు, కేవలం తినటానికి తిండి లేక 30లక్షల మంది ప్రజలు చనిపోయారు. వాస్తవానికి 1943లో అసలు కరువు ఏర్పడలేదు, క్షామం లాంటి పరిస్థితి లేదు, అయినప్పటికీ అంత మంది చనిపోవడానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ పండిన పంట మొత్తం ఇంగ్లాండుకు తరలించడం, రెండు ఇక్కడి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి ఉన్న కొంత ఆహార ధాన్యల్ని ఎక్కువ ధరకు అమ్ముకోవడం.

 దాని వల్ల బెంగాల్ లో, కృత్రిమ కరువు ఏర్పడి ఒక హోల్ జనరేషన్ ఆకలితో అంతమైపోయింది. (గూగుల్ చేసి చదవండి)

జై హింద్. 
#Save_farmers

🕉 *డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై*


        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌:  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉద‌యం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ....

🟢★ డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2021, జనవరి 14న ముగియనున్నాయి.

🕉 *ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…*
    ➖➖➖➖➖➖➖➖
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.

 కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

🕉 *దైవ ప్రార్థ‌న‌కు అనుకూలం…*

 తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. 

ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

🕉 *ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం…*

కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.

🕉 *ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం...*

         12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.

👉 శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.
👉 ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

🕉 *ధనుర్మాస వ్రతం …*

శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.
 *Dept.Of PRO TTD.* 

SSC CHSL 2020 Recruitment Vacancies Update || గుడ్ న్యూస్,SSC CHSL 2020 రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు విడుదల

 

SSC CHSL 2020 రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు విడుదల :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.


ఇటీవలే  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి విడుదలైన SSC  CHSL 2020 నోటిఫికేషన్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2020 నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్న 4726 పోస్టుల భర్తీ లో విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు విడుదల అయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన  విభాగాల వారి ఖాళీలను అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి చూడవచ్చును.

Website

IBPS Specialist Officer SO Various Post Recruitment 2020 Pre Admit Card

 https://ibpsonline.ibps.in/crpsplxoct20/cloea_dec20/login.php?appid=bef03ea361bc132ecdb31c68287e216e

9, డిసెంబర్ 2020, బుధవారం

రైల్వే పరీక్షలు: ఈనెల 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌.. త్వరలో అడ్మిట్‌ కార్డులు

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం తెలిసిందే. గతేడాది ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం కూడా విధితమే. అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించలేదు.

ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఏడాదిన్నరగా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ పోస్టులతో పాటు మిగిలిన పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

BOI Recruitment 2020 News in Telugu || బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

 

బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

బ్యాంకు ఆఫ్ ఇండియా (BOl) ముంబై లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై  చేసుకోవచ్చు. 


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 9,2020
దరఖాస్తుకు ముగింపు తేదీడిసెంబర్ 21,2020

విభాగాల వారీగా ఖాళీలు :

సెక్యూరిటీ ఆఫీసర్స్20
ఫైర్ ఆఫీసర్1

మొత్తం ఖాళీలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు..

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత సబ్జెక్టులలో  బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. గ్రాడ్యుయేషన్ /ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ లో 5 ఏళ్ళు అనుభవం ఉండవలెను. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ కోర్సును పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి నెలకు 30,000 రూపాయలు నుండి 45,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

ఫీజు :

జనరల్ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

Website

Notification

ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- 2021 నోటిఫికేషన్



దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలకునోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.
Adminissions ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్: 2020- 21

అర్హత:
  • 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.

వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.

పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.navodaya.gov.in  లేదా
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...