బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :
బ్యాంకు ఆఫ్ ఇండియా (BOl) ముంబై లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 9,2020 |
దరఖాస్తుకు ముగింపు తేదీ | డిసెంబర్ 21,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
సెక్యూరిటీ ఆఫీసర్స్ | 20 |
ఫైర్ ఆఫీసర్ | 1 |
మొత్తం ఖాళీలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు..
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత సబ్జెక్టులలో బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. గ్రాడ్యుయేషన్ /ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ లో 5 ఏళ్ళు అనుభవం ఉండవలెను. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ కోర్సును పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.
ఎంపిక విధానం :
గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి నెలకు 30,000 రూపాయలు నుండి 45,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.
ఫీజు :
జనరల్ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి