9, డిసెంబర్ 2020, బుధవారం

ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- 2021 నోటిఫికేషన్



దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలకునోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.
Adminissions ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్: 2020- 21

అర్హత:
  • 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.

వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.

పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.navodaya.gov.in  లేదా
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class

కామెంట్‌లు లేవు: