Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

రైల్వే పరీక్షలు: ఈనెల 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌.. త్వరలో అడ్మిట్‌ కార్డులు

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం తెలిసిందే. గతేడాది ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం కూడా విధితమే. అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించలేదు.

ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఏడాదిన్నరగా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ పోస్టులతో పాటు మిగిలిన పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

BOI Recruitment 2020 News in Telugu || బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

 

బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

బ్యాంకు ఆఫ్ ఇండియా (BOl) ముంబై లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై  చేసుకోవచ్చు. 


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 9,2020
దరఖాస్తుకు ముగింపు తేదీడిసెంబర్ 21,2020

విభాగాల వారీగా ఖాళీలు :

సెక్యూరిటీ ఆఫీసర్స్20
ఫైర్ ఆఫీసర్1

మొత్తం ఖాళీలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు..

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత సబ్జెక్టులలో  బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. గ్రాడ్యుయేషన్ /ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ లో 5 ఏళ్ళు అనుభవం ఉండవలెను. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ కోర్సును పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి నెలకు 30,000 రూపాయలు నుండి 45,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

ఫీజు :

జనరల్ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

Website

Notification

ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- 2021 నోటిఫికేషన్



దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలకునోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.
Adminissions ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్: 2020- 21

అర్హత:
  • 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.

వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.

పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.navodaya.gov.in  లేదా
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class

రెండేళ్లలో 10,000 మంది నర్సుల నియామకాలకు ఏపీ సర్కార్ కసరత్తు ..!



సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది.
Education News

ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్ కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్‌లు ఉన్నాయి.

  • మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు.
  • ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది.
  • పతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది.
  • ఎంపికై న నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు.
  • శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు.
  • కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు.


హెల్త్ క్లినిక్‌లలో 12 రకాల సేవలు

  • గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు
  • నవజాత శిశువులు టీకాలు
  • చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు
  • కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు
  • సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు
  • సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
  • మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం
  • కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు
  • సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు
  • వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు
  • అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం
  • చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్


కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న క్లినిక్‌లు

జిల్లా

హెల్త్ క్లినిక్స్ సంఖ్య

తూర్పుగోదావరి

1,084

అనంతపురం

632

కృష్ణా

666

శ్రీకాకుళం

653

గుంటూరు

638

పశ్చిమ గోదావరి

739

విజయనగరం

492

ప్రకాశం

744

నెల్లూరు

546

కర్నూలు

643

చిత్తూరు

728

వైఎస్సార్

500

విశాఖపట్నం

550

మొత్తం

8,615


ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం
ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్‌మెంట్ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం.
- అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ

అగ్రి, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

 

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Education Newsఏపీ ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ) కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. www.angrau.ac.in లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలన్నారు. నవంబరు నెల 23 నుంచి డిసెంబర్ 13 వరకు దరఖాస్తు గడువు పెంచామని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు సరిపోతుందన్నారు.
 

జేఈఈ మెయిన్ 2021: జనవరిలో కాదు ఫిబ్రవరిలో..


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించే జేఈఈ-మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
  ఈ పరీక్ష జనవరిలో జరగాల్సి ఉంది. ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నందున జేఈఈ మెయిన్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. సరైన బ్రాంచ్‌గానీ, స్కోర్‌గానీ రాలేదనుకునే విద్యార్థులకు ఇది మరో అవకాశాన్ని ఇస్తుందని అన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు కూడా వాయిదాకు మరో కారణమని చెప్పారు. పరీక్ష తేదీ వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

శుభవార్త... త్వరలో 499 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్!

 

సాక్షి, అమరావతి: వైద్యారోగ్యశాఖలో నియామకాల పరంపర కొనసాగుతోంది. తాజాగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికోసం సోమవారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చారు. మొత్తం 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే 61 మంది వైద్యులున్నారు. మరో 499 మందిని కొత్తగా నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా వీరిని నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సబ్జెక్టు మార్కులు 75గా నిర్ధారించగా, మిగతా 15 మార్కులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీకి ఇస్తారు. ఏజెన్సీల్లో పనిచేసిన వారికి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన వారికి 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఒక్క మార్కు ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన సంవత్సరం నుంచి ఏడాదికొకటి చొప్పున 10 మార్కులుంటాయి.

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...