గుంటూరు
రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు
ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు
ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ
ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు
చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల
పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్)
అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ
(బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్,
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ)
కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. www.angrau.ac.in
లో ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలన్నారు. నవంబరు నెల 23 నుంచి డిసెంబర్ 13
వరకు దరఖాస్తు గడువు పెంచామని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు
సరిపోతుందన్నారు.
కామెంట్లు