20, డిసెంబర్ 2020, ఆదివారం

🔳ఇందిరాగాంధీ నేష‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ ది ఆర్ట్స్‌(ఐజీఎన్‌సీఏ)

 మీడియా సెంట‌ర్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    టెక్నిక‌ల్ అసిస్టెంట్,బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌,వీడియో ఎడిట‌ర్‌, కెమెరాప‌ర్స‌న్‌, సౌండ్‌రికార్డిస్ట్‌, త‌దిత‌రాలు.
ఖాళీలు :    08
అర్హత :    పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, ఐటీఐ(ఎల‌క్ట్రానిక్స్‌),డిగ్రీ, బీటెక్‌/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.
వయసు :    45 ఏళ్ళు మించకుడదు .
వేతనం :    రూ. 35000/- రూ.80,000/-
ఎంపిక విధానం:    స్క్రీనింగ్ ,ఇంట‌ర్వ్యూ ఆదారంగా .
దరఖాస్తు విధానం:    ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 28, 2020.

http://ignca.gov.in/

🔳టెక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు



జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్‌ ఆపరేటర్‌, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్‌, ఆన్‌ లూమ్‌ చేకెర్స్‌, క్వాలిటీ ఇన్‌ఛార్జ్‌, డైయింగ్‌ మిషిన్‌ ఆపరేటర్‌, రోల్‌ డ్రోప్స్‌ పోస్టులకు పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత వసతి, భోజనం, ఆధునిక సాంకేతిక విధానాలతో కార్యశాల, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఆంగ్లంలో శిక్షణ ఇస్తారని వివరించారు. వివరాలకు www.apssdc.in వెబ్‌సైట్‌ని చూడాలని కోరారు.

🔳డిగ్రీలో ఒకేషనల్‌ కోర్సులు..దరఖాస్తులు ఆహ్వానించిన ఎపిఎస్‌సిహెచ్‌ఇ..





అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఒకేషనల్‌ డిగ్రీ కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఈ కోర్సులు ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొన్ని కళాశాలలకు అనుమతిచ్చిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) దానికి అనుగుణంగా ఆయా కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం సంబంధిత యూనివర్సిటీలను, ఫీజు నిర్ధారణ కోసం ఎపిఎస్‌సిహెచ్‌ఇను సంప్రదించాలని ఆదేశించారు. మిగిలిన వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌ షషష.aజూష్ట్రవతీఎష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు తెలిపారు.

🔳స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాల నియామకానికి సాంఘిక సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల నియామకానికి గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బిఎస్‌సి నర్సింగ్‌ లేదా జిఎన్‌ఎం విద్యార్హత కలిగి రెండు నుంచి మూడేళ్లు అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29 ఉదయం పది గంటలకు నిర్వహించే రాత, ముఖాముఖి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగలవారు వారి విద్యార్హతల సర్టిఫికెట్లతో సూచించిన సమయానికి హాజరుకావాలని కోరారు. నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం www.aphermc.ap.gov.in &nbsp సందర్శించాలని సూచించారు.

📚✍సంక్షేమ గురుకులాల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు✍📚



🌻సాక్షి, అమరావతి: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి గురుకుల సొసైటీ దరఖాస్తులు కోరుతున్నది. తాడేపల్లిలో ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 పోస్టులు ఖాళీ ఉన్నాయని, 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుందన్నారు. ఎస్ఎస్ సీ, ఇంటర్, బీఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లతో పాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, బయోడేటాను జతచేసి apswreishealth@gmail.comకు ఈనెల 28 సాయంత్రం 5లోపు పంపించాలని కోరారు.

📚✍ప్రాంతీయ భాషల్లోనూ క్యాట్‌!✍📚


♦2021 లేదా 2022లో అమలుకు అవకాశం

🌻ఈనాడు,న్యూస్ : ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ల(ఐఐఎం)లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)ను ప్రాంతీయ భాషల్లోనూ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు మొదలుపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానంలో చెప్పినట్లుగా ఇంజినీరింగ్‌ లాంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని, మొదట ఐఐటీల్లో ప్రారంభిస్తామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీట్‌ను రెండేళ్ల నుంచి ఆంగ్లం, హిందీతో పాటు మరో 11 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే కాలపట్టికను ప్రకటించిన జేఈఈ మెయిన్‌-2021ను కూడా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే క్యాట్‌ను కూడా అదే తరహాలో జరపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరీక్షను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో పెట్టాలని ఐఐఎం రోహ్‌తక్‌ ఆచార్యుడు ఒకరు ఇటీవల క్యాట్‌-2020 కన్వీనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయా ఐఐఎంలు సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ లెక్కన క్యాట్‌-2021 లేదా 2022లో అది కార్యరూపం దాల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

📚✍రేపు అమ్మఒడి లబ్ధిదారుల జాబితా✍📚



🌻ఈనాడు, అమరావతి: అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను సోమవారం పాఠశాలలు, గ్రామ/వార్డు సచివాలయాలకు అందించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు శనివారంతో గడువు ముగియడంతో ఆన్‌లైన్‌లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పరిశీలన అనంతరం జాబితాలను విడుదల చేయనున్నారు. అర్హులైన వారు అనర్హుల జాబితాల్లో ఉంటే సంబంధిత పాఠశాలకు వెళ్లి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నమోదు చేసే వివరాలను సంయుక్త కలెక్టర్లు పరిశీలించి, ఆమోదిస్తే అర్హుల జాబితాలోకి వస్తారు.