ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నియామకాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ డివిజన్ కేటగిరీ లో భర్తీ చేస్తున్నారు. AP High Court Recruitment 2020 Update
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో తాజాగా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 3,2020 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 2, 2021 |
ఉద్యోగాలు – వివరాలు :
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జడ్జి ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాలు :
సివిల్ జడ్జి లు | 68 |
( ఈ ఖాళీలలో 13 సివిల్ జడ్జి పోస్టుల ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు )
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు లా డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి మరియు మూడు (3) సంవత్సరాలు అడ్వాకేట్ గా ప్రాక్టీస్ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 నుండి 48 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 800 రూపాయలు ఫీజును మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరి ల అభ్యర్థులు 400 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష , వ్రాత పరీక్ష మరియు వైవ ల నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలును వేతనంగా పొందనున్నారు.
పరీక్ష కేంద్రాల ఎంపిక :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలుగా గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూల్ నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి