గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ పై ముఖ్యమైన అప్డేట్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో జరగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) నిర్వహిస్తున్న ఈ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఏపీ హైకోర్టు నేడు తమ కీలక నిర్ణయాన్ని ప్రకటించినది.
హైకోర్టు ప్రకటించిన ఈ కీలక నిర్ణయం ద్వారా ఏపీ లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఈనెల డిసెంబర్ -14 వ తేదీ నుండి జరగనున్నాయి.
ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష కు కొత్తగా ఎంపికైన అభ్యర్థులు తమకు పరీక్ష ప్రిపరేషన్ కు సమయం సరిపోదంటూ, పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టు లో రిట్ వేయగా,
నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యర్థుల రిట్ పిటిషన్ ను తిరస్కరించినది. దీనితో ఏపీ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నెలకొని ఉన్న సంధిగ్దత కు తెరపడినది.
ఏపీ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ పై నేడో, రేపో అధికారిక సమాచారం రానుంది.
ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ ను అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి