9, డిసెంబర్ 2020, బుధవారం

APPSC Latest update in Telugu 2020 || బిగ్ బ్రేకింగ్ న్యూస్, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ముఖ్యమైన అప్డేట్

 

గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో జరగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) నిర్వహిస్తున్న ఈ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఏపీ హైకోర్టు నేడు తమ కీలక నిర్ణయాన్ని ప్రకటించినది.

హైకోర్టు ప్రకటించిన ఈ కీలక నిర్ణయం ద్వారా ఏపీ లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఈనెల డిసెంబర్ -14 వ తేదీ నుండి జరగనున్నాయి.

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష కు కొత్తగా ఎంపికైన అభ్యర్థులు తమకు పరీక్ష ప్రిపరేషన్ కు సమయం సరిపోదంటూ, పరీక్షలను వాయిదా వేయాలంటూ  హైకోర్టు లో రిట్ వేయగా,

నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యర్థుల రిట్ పిటిషన్ ను తిరస్కరించినది. దీనితో ఏపీ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నెలకొని ఉన్న సంధిగ్దత కు తెరపడినది.

ఏపీ  లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ పై నేడో, రేపో అధికారిక సమాచారం రానుంది.

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ ను అభ్యర్థులు ఈ  క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

website

కామెంట్‌లు లేవు: